డైరెక్టర్ అట్లీ భార్య ఆరోజుల్లో తారకరత్న తో ఇంత నడిపిందా..! బయటపడ్డ సంచలన నిజం

- Advertisement -

ఇండియా మొత్తం ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ పేరు ఎలా మారుమోగిపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే రీసెంట్ గానే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో చేసిన ‘జవాన్’ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతుంది కాబట్టే.

‘రాజా రాణి’ అనే చిత్రం ద్వారా కెరీర్ ని ప్రారంభించిన అట్లీ, ఆ తర్వాత విజయ్ తో ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిజిల్’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారాడు. దీంతో ఆయనకీ ఏకంగా షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. వచ్చిన ఆ అద్భుతమైన అవకాశం ని ఉపయోగించుకుంటూ, షారుఖ్ ఖాన్ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో మాస్ యాంగిల్ లో చూపించాడు. ఫలితంగా ఆ చిత్రం నేడు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కొల్లగొట్టబోతుంది.

ఇదంతా పక్కన పెడితే అట్లీ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇతను కృష్ణ కుమారి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ కుమారి తెలుగు మరియు తమిళం భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, అలాగే పలు సినిమాల్లో హీరోలకు చెల్లెలుగా కూడా నటించింది. అలా ఆరోజుల్లో ఈమె నందమూరి తారకరత్నతో కలిసి ‘యువ రత్న’ అనే చిత్రం చేసింది.

- Advertisement -

ఈ సినిమా ఆరోజుల్లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ, కృష్ణ కుమారి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె తారకరత్న కి చెల్లెలు గా నటించింది. ఈమె తారకరత్న కి అప్పట్లో మంచి స్నేహితురాలు అట. తారకారత్న బ్రతికి ఉన్నన్ని రోజులు అతనితో బాగానే మాట్లాడేది అట. ఆయన చనిపోయినప్పుడు కృష్ణ కుమారి చాలా బాధపడింది అట. ఆమెకి సినిమాల్లో అవకాశాలు రప్పించడానికి అప్పట్లో తారకరత్న చాలా ప్రోత్సహించాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here