బలిసిందా అంటూ గోపీచంద్ ను బండబూతులు తిట్టిన దర్శకుడు..

- Advertisement -

ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు. అవకాశాలు ఉన్నప్పుడు పొగిడినావారే.. అవకాశాలు లేనప్పుడు తిట్టిపోస్తారు. యజ్ఞం సినిమాతో గోపీచంద్ ను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ AS. రవి కుమార్ చౌదరి. దాదాపు పదేళ్ల తరువాత ఈ డైరెక్టర్.. తిరగబడరా సామీ అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలకృష్ణతో వీరభద్ర లాంటి భారీ పరాజయాన్ని అందుకున్నాక.. అవకాశాల కోసం తాను హీరోగా పరిచయం చేసిన గోపీచంద్ దగ్గరకు వెళ్లి ఛాన్స్ అడిగితే.. తనను వెయిట్ చేయించాడని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మధ్యనే హీరోయిన్ మన్నార్ చోప్రాను పబ్లిక్ గా ముద్దుపెట్టిన వివాదంలో రవి కుమార్ పేరు మారు మ్రోగిపోతున్న విషయం తెల్సిందే. ఆ వివాదంపై క్లారిటీ ఇవ్వడానికి చేసిన ఇంటర్వ్యూలోలో గోపీచంద్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు రవి కుమార్. ‘‘వాడిని హీరోను చేసింది నేనే.. ఒకప్పుడు విలన్ వేషాలు వేసుకొని బతికేవాడు.. మాతో కలిసి చెట్టు కింద కలిసి తినేవాడు.

ఏరా .. ఇప్పుడు నీకు బాగా బలిసింది కదా.. నిన్ను నేను చూడాలంటే ఐదుగురును దాటుకొని రావాలా ? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్. ఇప్పుడు నేను వచ్చాను అని చెప్తే.. వెయిట్ చేయమని చెప్తావా.. ?. ఒకప్పుడు నా సినిమాతో ఎదిగినవాడు ఇప్పుడు బలుపు ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదు. వాడు ఎదురైనా ఇలాగే మాట్లాడతా.. ?. ముఖం మీద మేకప్ వేసుకున్నాకా.. మేకలాంటి చేష్టలు చాలామందికి ఉంటాయి. ఇది కోపం, ఆగ్రహం కాదు.. ఆవేదన” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవికుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here