అనుపమ కెరీర్ నాశనం అవ్వడానికి దిల్ రాజే కారణమా..

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అ ఆ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టికి తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు కుర్రకారు లో భారీ క్రేజ్ ఉంది అంటే అతిసయోక్తి కాదు.. తెలుగులోనే కాదు మలయాళం, తమిళంలోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందిఅనుపమ . గత ఏడాది కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా లిస్ట్ లో చేరిపోయారు ఈ ముద్దుగుమ్మ.

అనుపమ
అనుపమ

ప్రేమమ్ సినిమాతో తన రింగు రింగుల జుట్టుతో బొంగరం లాంటి కళ్ళతో అందర్నీ కట్టిపడేసింది అనుపమ పరమేశ్వరన్.ఈ సినిమా తర్వాత అనుపమ అ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలాగే శతమానం భవతి సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కి నిర్మాత దిల్ రాజు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అలాగే రౌడీ బాయ్స్ సినిమాలో దిల్ రాజు చెప్పడం వల్ల దిల్ రాజు మేనల్లుడు ఆశీష్ రెడ్డి తో కలిసి నటించిన ఈ సినిమాలో కిస్ సీన్ లో నటించి అనుపమ మొదటిసారి తన పేరును ఇండస్ట్రీలో వైరల్ చేసుకుంది.

అనుపమ పరమేశ్వరన్

అలా ఎప్పుడూ పద్ధతి గల పాత్రల్లో నటించే అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ఈ సీన్ లో నటించి తన పైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంతో అనుపమ పరమేశ్వరన్ అభిమానులు అందరూ దిల్ రాజు వల్లే అనుపమ కెరియర్ నాశనమైంది అని తిట్టుకున్నారు. రీసెంట్ గా18 పేజెస్ అనే యూత్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ ప్రస్తుతం డీజే టిల్లుస్క్వేర్‌ సినిమాలో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here