ఆ కోరిక తీర్చుకోవడం కోసం రేణు దేశాయ్ ఇంట్లో నుండి పారిపోయిందా..

- Advertisement -

సినిమా హీరోయిన్ గా మరియు పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా రేణు దేశాయ్ కి మంచి పాపులారిటీ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘బద్రి’ ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి, అతనితో కొన్నాళ్ళు సహజీవనం చేసి అకీరానందన్ మరియు ఆద్య కి జన్మనిచ్చింది.

రేణు దేశాయ్
రేణు దేశాయ్

ఆ తర్వాత వీళ్లిద్దరు 2008 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వరకు దాంపత్య జీవితం కొనసాగించిన ఈ ఇద్దరు, కొన్నాళ్ళకు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి పూణే కి వెళ్ళింది. ఇప్పుడు ఆమె మళ్ళీ రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇది ఇలా ఉండగా రేణు దేశాయ్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈమె ఇంట్లో తల్లిదండ్రులు ఆడవాళ్లకంటే మగవాళ్లకు ఎక్కువ ప్రాముఖ్యత చూపేవారట, ఆడవాళ్లు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అనుకునే టైప్. కానీ రేణు దేశాయ్ అలా కాదు, ఆమ్నెకి చాలా కోరికలు ఉన్నాయి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంది.

- Advertisement -

కానీ ఇంట్లో ఒప్పుకోలేదు, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అందరు నిద్రపోతున్న సమయం లో ఇంట్లో నుండి పారిపోయి తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత బద్రి సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండీస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇప్పుడు రీ ఎంట్రీ ద్వారా ఆమె ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here