Rashmi Gautam : రష్మీ గౌతమ్ ఇంట విషాదం.. ఆస్తికలను చేతిలో పట్టుకుని ఎమోషనల్ పోస్ట్

- Advertisement -


Rashmi Gautam : బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకుంది. ఈ షో ద్వారా స్కిన్ షో చేస్తూ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇటు యాంకరింగ్ అటు పలు సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ.. బిజీ బిజీగా రాణిస్తుంది. ఇక తాజాగా రష్మి గౌతమ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఎప్పటి నుంచో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెట్ డాగ్ చుట్కి గౌతం మరణించింది.

మామూలుగానే రష్మి పెట్స్ లవర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. మూగజీవాలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన.. తను వెంటనే రియాక్ట్ అయ్యేది. సోషల్ మీడియా వేదికగా స్పందించేది. అలాంటిది ఆమె.. తను ఎంతో గారాభంగా పెంచుకున్న చోట్కి మరణించడంతో ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ తన పెట్ డాగ్ బతికి ఉన్నప్పుడు దానితో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్లను ఫోటోలు తీసి.. అది చనిపోయిన తర్వాత దానికి పూల‌మాల‌లు వేసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

దీంతో పాటే ఎమోషనల్ నోట్ రాసుకోవచ్చింది. నా సాసి ప్రిన్సెస్.. నా బంగారంతో గత 24 గంటలు ఎంతో ఎమోషనల్ గా గడిచాయి. తను లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. చివరి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా లవ్ యు మై బేబీ గర్ల్ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం రష్మీ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో చాలా మంది బాధపడకు రష్మీ అంటూ.. చుట్కి గౌతం జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి లే అంటూ.. స్వర్గంలో ఆమె సంతోషంగా ఉంటుందంటూ రష్మీని ఓదారుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here