Darshan Case Update : టార్చర్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేసిన పవిత్ర..వెలుగులోకి సంచలన నిజాలు..

- Advertisement -

Darshan Case Update  : కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో దర్శన్ పవిత్ర ల పేర్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.. ఓ మర్డర్ కేసులో ఇద్దరు పోలీసుల కస్టడీలో ఉన్నారు.. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.. ఎన్నో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి.. రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేయించిన కేసులో దర్శన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లయినా కూడా పవిత్ర గౌడ అనే నటితో  సహజీవనం చేస్తున్నాడు దర్శన్. అదే సమయంలో పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నాడనే కారణంతో రేణుకా స్వామి ని అతి దారుణంగా చంపించాలని అనుకున్నాడు..

Darshan Case Update
Darshan Case Update

తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. రేణుకా స్వామిని హత్య చేస్తున్న సమయంలో పవిత్ర గౌడ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.. రేణుకా స్వామిని పక్కా ప్లాన్ తో అతి దారుణంగా హత్య చేయించాడు దర్శన్.. అతన్ని చంపడానికి ముందు విపరీతంగా టార్చర్ చేశారని తెలిసింది. తనను కర్రలతో బాగా కొట్టారని పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా బయటికొచ్చింది. అంతే కాకుండా అంత గట్టిగా కొట్టడం వల్ల రేణుకా స్వామి ఎముకలు విరిగాయట.. మొత్తంగా అతని ఒంటి పై 30 గాయాలు ఉన్నట్లు తెలుస్తుంది..

తాజాగా ఈ హత్య కేసు విచారణలో మరో నిజం వెలుగు చూసింది.. రేణుకా స్వామిని టార్చర్ చేస్తుంటే పవిత్ర దగ్గరుండి ప్రత్యక్షంగా చూస్తూ ఎంజాయ్ చేసిందని తేలింది.. దాంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. రేణుకా స్వామి హత్య కేసులో పోలీసులు మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో దర్శన్, పవిత్ర గౌడ కూడా ఉన్నారు. ఈ పని చేయడం కోసం వారందరికీ రూ.50 లక్షలు ఇచ్చాడట దర్శన్… ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది.. ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here