మరో నెల రోజుల్లో ‘బ్రో’ సినిమా విడుదల..ఇప్పటికీ టీజర్ లేదు..చరిత్రలో ఇదే తొలిసారి ఏమో!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న చిత్రం ‘బ్రో ది అవతార్’. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ అనే ఓటీటీ చిత్రం లోని స్టోరీ లైన్ ని తీసుకొని, పవన్ కళ్యాణ్ ఇమేజీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తీశారు. సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.

బ్రో
బ్రో

సాయి ధరమ్ తేజ్ మరో హీరో గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.ఈ సినిమా వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కేవలం మోషన్ పోస్టర్స్ మినహా , మరో కంటెంట్ రాలేదు, ఇది పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రమైన అసహనం కి గురి చేస్తున్న విషయం.

పవన్ కళ్యాణ్ సినీ చరిత్ర లో ఇప్పటి వరకు ఒక సినిమాకి విడుదలకు నెల రోజుల ముందు టీజర్ మరియు పాటలు విడుదల అవ్వకుండా ఉండలేదు. కానీ మొట్టమొదటిసారి ఈ చిత్రంని విషయం లోనే ఇలా జరిగింది. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు దీనిపై పెద్ద రచ్చ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ని ట్యాగ్ చేసి బండ బూతులు తిడుతున్నారు.

- Advertisement -

ఈ వారం లో టీజర్ కి సంబంధించిన అప్డేట్ వస్తుందని ఒక వార్త ప్రచారం అయ్యింది, కానీ దానిమీద ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు వచ్చే వారం కచ్చితంగా టీజర్ ని విడుదల చేస్తామని అంటున్నారు. ఈసారి విడుదల చెయ్యకపోతే,ఫ్యాన్స్ మొత్తం కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ హ్యాండిల్ పై రిపోర్ట్స్ కొడతామని, ఖబర్దార్ అంటూ హెచ్చరిచకలు జారీ చేస్తున్నారు. మరి వచ్చే వారం లో అయినా ఈ సినిమా టీజర్ వస్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here