Jabardasth : షాకింగ్ న్యూస్.. నిలిచిపోతున్న జబర్దస్త్ కామెడీ షో..కారణం ఇదే !

- Advertisement -

Jabardasth : బుల్లితెర పై దాదాపు పదేళ్లుగా ఎలాంటి బ్రేక్ లేకుండా తిరుగులేని షోగా జబర్దస్త్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎంతోమందికి మంచి జీవితాన్ని ప్రసాదించింది. కమెడియన్స్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ కమెడియన్స్ గా, హీరోలుగా వెండితెరపై వెలుగుతున్నారు. మొదట జబర్దస్త్ గా మొదలై తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో వారానికి రెండు రోజులు ప్రసారం కావడం ప్రారంభమైంది. ఇలా చాలా ఏళ్లుగా కోట్లాదిమంది అభిమానులను దక్కించుకున్న జబర్దస్త్ షో పూర్తిగా ఆగిపోనుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రోమోలో టీం ప్రకటించారు. అసలు ఏం జరిగిందనేది ఓ లుక్కెద్దాం. 2013లో జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైంది.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది కమెడియన్లు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి నేడు సెలబ్రెటీస్ గా మారారు.

అదే టైంలో జడ్జీలుగా వ్యవహరించిన రోజా, నాగబాబు, ఇంద్రజ కూడా ప్రేక్షకులకు బుల్లితెరతో మరింత దగ్గరయ్యారు. వాళ్లు మాత్రమే కాదు ఈ ఆ షోకు యాంకర్‌గా వ్యవహరించిన రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్ కూడా స్టార్లు అయ్యారు. అయితే మెల్లమెల్లగా మొదట జడ్జెస్, తర్వాత యాంకర్స్ మారుతూ రావడంతో షోలో కుదుపులు మొదలయ్యాయి. మొదట షోకు చాలా కాలం పాటు జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా షో నుంచి విడిపోవడంతో మొదటి జనరేషన్ కమెడియన్స్ కూడా జబర్దస్త్ మానేసి వెళ్లిపోయారు. దీంతో జడ్జిలు, యాంకర్లు, టీం లీడర్లు, కమెడియన్లు అందరూ కొత్తవాళ్లు వచ్చి షోను కొనసాగించే ప్రయత్నం చేశారు.

- Advertisement -

అయితే తాజాగా ఇంద్రజ కూడా ఈ షో నుంచి బయటకు వెళ్లిపోతుందంటూ వార్తలు వచ్చాయి. ఇదే షోలో ఇంద్రజ హైలెట్ గా ఉందన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఈమె షోను సక్సెస్ చేయడంలో.. తన వంతు కృషి చేసింది. కానీ వచ్చేవారం నుంచి జబర్దస్త్ లో ఇంద్రజ తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని కూడా ప్రోమోలో చూపించారు. కానీ ఉన్నట్లుండి మొత్తాన్ని కూడా ఆపేస్తున్నారట మేకర్స్. ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత లాక్ డౌన్ సమయంలో తప్ప ఎప్పుడూ ఆగకుండా నిరంతరాయంగా కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ షోను ఆపేస్తున్నట్లు.. ఇకపై గురు, శుక్రవారం జబర్దస్త్ మాత్రమే ప్రసారమవుతున్నట్లు తాజా ప్రోమోలో చెప్పుకొచ్చారు.

ఆటో రాంప్రసాద్ తన స్కిట్ ద్వారా ఎక్స్ట్రా జబర్దస్త్ ను ఆపేస్తున్నట్లు ప్రకటించాడు. మాకు రెండు కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఒకటే చేస్తున్నాం అంటూ మ్యాట‌ర్‌ చెప్పాడు. అసలు ఎందుకిలా చేశారో.. అంటూ రాంప్రసాద్ మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అది మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందంటూ తన బాధను వ్యక్తం చేశాడు. అనంతరం యాంకర్ రష్మీ ఎక్స్ట్రా పదం మిస్ అవుతుంది.. కానీ రెండు ఎపిసోడ్స్ వస్తాయి అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ షో రెండు రోజులు వచ్చిన ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది మాత్రం ఉండదు.. కేవలం జబర్దస్త్ మాత్రమే ఉంటుంది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here