Bigg Boss Telugu : నిన్న జరిగిన పోలింగ్ లో బిగ్‌బాస్ హౌస్‌ కంటెస్టెంట్లు ఎలా ఓటేశారో తెలుసా ?

- Advertisement -


Bigg Boss Telugu : రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పోలింగ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకున్న పలు పార్టీ నేతలు ఇప్పుడు అధికారం ఎవరి చేతిలోకి రాబోతుంది..?? అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమంటుంటే.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ ప్రకటించాయి. మరి కొంతమంది తెలంగాణలో ట్రెండు మారబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

అయితే చాలామంది వర్షం కారణంగా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మరి కొంతమంది నాలుగు రోజులు వరుస సెలవులు రావడంతో ఓటు వేయకుండా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు అధికారులు ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ప్రచారం చేసినా ఫలితం మాత్రం కనిపించలేదు. అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. అందరికీ ఓకే మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటి ..??

Telangana Elections

వాళ్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి ..?? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం లేదా ఇతర ప్రత్యేక విధుల్లో భాగంగా బయటకు వెళ్లి పోలింగ్ బూత్ కి దూరంగా ఉన్నవారికి ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా తమ ఓటింగ్ వేసే అవకాశం కలిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కూడా అలా బ్యాలెట్ ఓటింగ్ వేసే సదుపాయం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం ట్రెండింగ్లో ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here