Bigg Boss Keerthy : కుమారి ఆంటీ ఫుడ్ దరిద్రంగా ఉంది అంటూ బిగ్ బాస్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్!

- Advertisement -

Bigg Boss Keerthy : సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన కుమారి ఆంటీ హైదరాబాద్ లోని ఒక ఫుట్ పాత్ వద్ద ఫుడ్ సెంటర్ ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఫుడ్ ని తినేందుకు హైదరాబాద్ నలుమూలల నుండి జనాలు వస్తున్నారు. ఈమె దాటికి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువగా జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ సెంటర్ ని ముయ్యించేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ చేత ఫుడ్ సెంటర్ ని ప్రారంభింపచేసారు. రోజుకి సుమారుగా లక్ష రూపాయిలను ఆమె ఈ ఫుడ్ సెంటర్ ద్వారా సంపాదిస్తున్నారు అంటే ఆమె హోటల్ లో ఫుడ్ ఏ రేంజ్ రుచికరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ ఒక బిగ్ బాస్ బ్యూటీ మాత్రం కుమారి ఆంటీ ఫుడ్ పెద్ద రుచికరంగా లేదని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన కీర్తి భట్, రీసెంట్ గానే కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ లో ఫుడ్ ని తినింది అట. ఈ ఫుడ్ టేస్ట్ గురించి ఆమె మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

- Advertisement -
Bigg Boss Keerthy
Bigg Boss Keerthy

ఆమె మాట్లాడుతూ ‘ఇటీవలే కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ కి వెళ్లి వైట్ రైస్, చికెన్ ఫ్రై ని తీసుకున్నాము. ఇందుకోసం 170 రూపాయిలు ఖర్చు చేసాము. చికెన్ ఫ్రై చాలా స్పైసీ గా ఉంది. అసలు తినలేకపోయాను. నాకైతే అసలు నచ్చలేదు, అందరూ ఎందుకు అలా ఎగబడి తింటున్నారో అసలు అర్థం కావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. నీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం లేదేమో,అందుకే నీకు అలా అనిపించి ఉండొచ్చు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కీర్తి భట్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here