Bigg Boss Telugu : ఎలిమినేట్ కాగానే మాట మార్చిన శుభ శ్రీ.. అతడిపై దుమ్మెత్తిపోసిందిగా..

- Advertisement -

Bigg Boss Telugu : అయిదో వారంలో కూడా లేడీ కంటెస్టెంటే.. బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయింది. తనే శుభశ్రీ. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని శుభశ్రీ ఎలిమినేట్ అయిన కాసేపటికే గౌతమ్ కూడా ఎలిమినేట్ అని ప్రకటించారు నాగార్జు. కానీ శుభశ్రీ హౌజ్ వదిలి వెళ్లిపోగా.. గౌతమ్ మాత్రం సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. శుభశ్రీ బయటికి వెళ్లగానే బిగ్ బాస్ బజ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘మనోభావాలు దెబ్బతిన్నాయా’’ అన్న ప్రశ్నకు ‘‘అమర్‌దీప్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి’’ అంటూ తమ నామినేషన్స్ గొడవను గుర్తుచేసుకుంది శుభశ్రీ.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

‘‘హౌజ్‌లో ట్రాక్స్ నడిచాయి అంటే దానికి మీ సమాధానం ఏంటి’’ అని అడిగింది గీతూ. ‘‘ప్రశాంత్, రతిక గురించి చెప్తున్నారా’’ అని ఏం తెలియనట్టు అమాయకంగా అడిగింది శుభశ్రీ. ‘‘రతికతో మాత్రమే ట్రాక్స్ ఉన్నాయా ఇంకా ఎవరితో లేవా’’ అని స్పష్టంగా అడిగింది గీతూ. ‘‘ఛాన్సే లేదు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చింది శుభ. ‘‘గౌతమ్ చేతిలో కీలుబొమ్మ శుభశ్రీ’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది గీతూ.

‘‘ఎవరి బొమ్మ కాదు’’ అని సమాధానమిచ్చింది శుభశ్రీ. ‘‘మీరు బయటికి రావడానికి ఇదే కారణం అయ్యిండొచ్చేమో అని మీ అంచనా లేదా ఈ కంటెస్టెంట్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యానేమో’’ అంటే ‘‘కచ్చితంగా అమర్‌దీప్’’ అని వెంటనే సమాధానమిచ్చింది శుభశ్రీ. ‘‘మీరు ప్రేక్షకులకు సమాధానం ఇవ్వాల్సిందే. గౌతమ్, యావర్‌లో ఒకరిని ఎంచుకోండి’’ అని అడిగింది గీతూ. ఈ ప్రశ్నకు అనూహ్యంగా.. ‘‘గౌతమ్ నమ్మకస్తుడు కాదు.. స్వార్థపరుడు’’ అంటూ సమాధానమిచ్చింది శుభశ్రీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here