Bhagavanth Kesari : ‘బుక్ మై షో’ లో పాన్ ఇండియన్ క్రేజీ మూవీస్ ని వెనక్కి నెట్టిన ‘భగవంత్ కేసరి’..ఇదేమి అరాచకం సామీ!

- Advertisement -

Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ లో ఎన్నడూ లేనంత పీక్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ‘అఖండ’ చిత్రం తో సెన్సేషన్ సృష్టించిన బాలయ్య ఆ తర్వాత ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక ఈ ఏడాది ప్రారంభం లో ఆయన సంక్రాంతి కానుకగా ‘వీర సింహా రెడ్డి’ చిత్రాన్ని విడుదల చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

Bhagavanth Kesari
Bhagavanth Kesari

ఈ రెండు సినిమాల తర్వాత ఆయన అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేసాడు. ఈ నెల 20 వ తారీఖున ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిన్న విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే బుక్ మై షో లో పాన్ ఇండియన్ సినిమాలకు కూడా సాధ్యపడని అరుదైన రికార్డు ని నెలకొల్పింది ‘భగవంత్ కేసరి’.

అదేమిటంటే ఈ చిత్రాన్ని చూసేందుకు అప్పుడే లక్ష 48 వేల మంది ఆసక్తి చూపిస్తున్నారు అని బుక్ మై షో యాప్ లో తెలిసింది. పుష్ప ది రూల్, ఓజీ, హరి హర వీరమల్లు, దేవర , గేమ్ చేంజర్ మరియు కల్కి వంటి చిత్రాలకు కూడా ఈ స్థాయిలో ఇంట్రెస్ట్స్ రాలేదట. ‘సలార్’ చిత్రం తర్వాతి స్థానం లో ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ చిత్రం కొనసాగుతుంది.

- Advertisement -
balakrishna Bhagavanth Kesari

ఇది చూసి బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యే రోజే రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి కేవలం 35 వేల ఇంట్రెస్ట్స్ మాత్రమే దక్కాయి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా కూడా ఇదే రేంజ్ ని చూపిస్తుందో లేదో అనేది చూడాలి . ట్రైలర్ చూస్తుంటే పక్కా బ్లాక్ బస్టర్ అనే అనిపిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here