ముగ్గురు హీరోలను స్టార్లను చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ముగ్గురు హీరోల ప్రస్తుత స్థితికి ఓ హీరోయిన్ కూడా ఓ కారణమని తెలుసా. ఆమె వారితో నటించిన సినిమాలన్నీ సంచలన విజయాలు సాధించి వారికి ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చి పెట్టాయి. వారెవరో కాదు.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. తెలుగులో ఈ ముగ్గురి కెరీర్ ను మార్చిన సినిమాల్లో ఒక్కరే హీరోయిన్. ఆమె ఎవరో గుర్తుకు వచ్చిందా… తనేనండి భూమిక. తాను పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాలో నటించింది. 2001లో విడుదలైన ఆ సినిమా ఇప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో క్రేజ్ మామూలుగా పెరగలేదు. ఈ సినిమాలో బొడ్డు సీన్ ను ఇప్పటికీ పలు సినిమాల్లో ఇమిటేట్ చేస్తూనే ఉన్నారు. ఖుషీ సినిమాలోని పాటలు ఇప్పటికి పవన్ ఫ్యాన్సుకు ఫేవరేటే.

Bhumika
Bhumika

మహేష్ బాబు కెరీర్ నే కీలక మలుపు తిప్పిన చిత్రం ఒక్కడు. ఈ సినిమాలో కొండారెడ్డి బురుజు వద్ద ప్రకాష్ రాజ్ ని కొట్టే సీన్ ఇప్పటికి అంత తర్వగా ఎవరూ మర్చిపోరు. 2003 లో వచ్చి మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు సరసన భూమికనే నటించింది. అంతేకాకుండా సింహాద్రి.. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపేసిన సినిమా. ఈ చిత్రంతో ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా దర్శకత్వం వహించిన రాజమౌళికి సినిమాకు తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. విశేషమేమిటంటే.. 2003 లోనే ఈ సినిమా విడుదలైంది. దీంట్లో కూడా భూమికే హీరోయిన్. ఈ సినిమాతో జూ ఎన్టీఆర్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. ఈ ముగ్గురు స్టార్స్ కెరీర్ ని మార్చేసిన సినిమాల్లో భూమిక ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం భూమిక పెళ్లి చేసుకున్న భూమిక.. తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here