Anchor Lasya : బుల్లితెర యాంకర్ లాస్య ని సెట్స్ లోకి వచ్చి చితకబాదిన భర్త.. వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Anchor Lasya : ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ యాంకర్స్, కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. అలాంటి టాలెంటెడ్ యాంకర్స్ లో ఒకరు లాస్య. అప్పట్లో ఈమె ఈటీవీ లో యాంకర్ రవితో కలిసి చేసిన షోస్ పెద్ద సెన్సేషన్ అయ్యాయి. దాంతో ఈటీవీ యాజమాన్యం ఎక్కువగా లాస్య, రవి లతో షోస్ ప్లాన్ చేసేవారు.

Anchor Lasya
Anchor Lasya

అలా బుల్లితెర ద్వారా బాగా దగ్గరైన యాంకర్ లాస్య, బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టి, అద్భుతంగా గేమ్ ఆడి, తన నడవడికతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కానీ ఎందుకో ఈమె ఈమధ్య కాలం లో ఏ షోలో కూడా కనిపించడం లేదు. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత పలు ఈవెంట్స్ లో వరుసగా కనిపిస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత మాయం అయిపోయింది. తన భర్త మంజునాథ్ తో కలిసి చాలా సాధారణమైన జీవితం గడుపుతూ సుఖంగా జీవిస్తుంది.

Anchor Lasya

అయితే బుల్లితెర ఆడియన్స్ కి ఈమె దూరమైనప్పటికీ సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్ కి మాత్రం బాగా దగ్గరైంది. ఇంస్టాగ్రామ్ లో ఈమె తనకి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కొన్ని రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా సోషల్ మీడియా లో కుమారి ఆంటీ చెప్పిన డైలాగ్ ‘మీరు వేసుకున్న రెండు లివర్స్ కి ఎక్స్ ట్రా గా వెయ్యి రూపాయిలు అయ్యింది’ అనేది ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

- Advertisement -
Anchor Lasya Family

ఈ డైలాగ్ తో ఆమె ఒక రీల్ చేసింది. ముందుగా తన భర్త కి వంట వండిస్తుంది, ఆ తర్వాత కుమారి ఆంటీ చెప్పిన ఆ డైలాగ్ ని వాడుతుంది. దీంతో ఆమె భర్త కుర్చీ ని తీసుకొని లాస్య ని కొడుతాడు. ఇదంతా ఫన్నీ వే లోనే జరగగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here