Ramayanam : రణబీర్ ‘రామాయణం’లో అమితాబ్ బచ్చన్ ఏ పాత్రలో కనిపించబోతున్నారంటే ?

- Advertisement -


Ramayanam : బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం చాలా కష్టపడుతున్నాడు. తన సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్‌ని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాముడి పాత్రకు రణబీర్ కపూర్, సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయగా.. ఇప్పుడు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నితీష్ తివారీ ‘రామాయణం’లో అమితాబ్ బచ్చన్ దశరథ రాజు పాత్రను పోషించబోతున్నారు. ఈ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ను సంప్రదించడం ఇదే మొదటిసారి కాదు. చాలా సంవత్సరాల క్రితమే బిగ్ బికి దశరథ్ రాజు పాత్రను ఆఫర్ చేశారు.

నిజానికి సంజయ్ ఖాన్ ది లెజెండ్ ఆఫ్ రామ్ అనే టైటిల్ తో సినిమా అనుకున్నాడు. అప్పుడు కూడా దశరథ రాజు పాత్ర కోసం అమితాబ్‌ని సంప్రదించారు. ఈ సినిమాలో రామ్ పాత్రలో హృతిక్ రోషన్ ను ఎంచుకున్నారు. సంజయ్ కొడుకు జైద్ ఖాన్ లక్ష్మణ్‌గా నటించాల్సి ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. నేడు అమితాబ్ తులసి పూజ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాలలో అమితాబ్ బచ్చన్ తులసికి నీరు, పాలు అందిస్తున్నట్లు కనిపించారు.

నితేష్ తివారీ యొక్క ‘రామాయణం’ స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుతూ… రాముడి పాత్రలో రణబీ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించబోతున్నారు. సౌత్ సూపర్ స్టార్ యష్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సన్నీ డియోల్ హనుమంతుడి అవతారంలో కనిపించనుండగా, లారా దత్తా కైకేయి పాత్రను పోషిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రను పోషిస్తుంది. నితీష్ తివారీ మార్చి 2024 నుండి ‘రామాయణం’ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. మూడు భాగాలుగా ఈ సినిమా రూపొందనుంది. 2025 దీపావళికి ముందు మేకర్స్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని.. ఆ తర్వాతే సినిమా విడుదల తేదీని వెల్లడిస్తారని సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here