అవార్డు వచ్చాక బ్రహ్మానందాన్ని కలిసిన అల్లు అర్జున్.. దీని వెనక ఇంత కథ ఉందా..!

- Advertisement -

ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్‌ వివాహం డాక్టర్ ఐశ్వర్యతో లాస్ట్ వీక్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అల్లు అర్జున్ బిజీగా ఉండటం వల్ల అటెండ్ కాలేకపోయారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ తాజాగా బ్రహ్మానందం ఇంటికి వెళ్లి నూతన వధూవరులను పలకరించారు. 69వ జాతీయ అవార్డుల్లో పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు సాధించారు. ఈ విషయమై బన్నీతో మాట్లాడిన బ్రహ్మీ..తన ఇంట్లో అల్లు అర్జున్ ని సన్మానించారు. దీంతో అల్లు అర్జున్తో దిగిన బ్రహ్మీ ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మనందం కొడుకు -కోడలుతో ఉన్న అల్లు అర్జున్ పిక్స్ క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి.

నేషనల్ స్టార్తో..బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ అల్లు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దాదాపు 2 గంటల పాటు బ్రహ్మీ ఫ్యామిలీతో అల్లు అర్జున్ టైం స్పెండ్ చేశారు. ఇక గత వారం జరిగిన ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అంతేకాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్‌చరణ్‌, మోహన్‌ బాబు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై హాజరై వధూవరులను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here