Allu Arjun : ఎమోషనలైన అల్లు అర్జున్.. అభిమానులకు మాటిచ్చేశాడుగా..!

- Advertisement -

Allu Arjun : అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

ఈ ఘనతను సాధించడం పై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఆ ట్వీట్ లో ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే విడుదలైంది. ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరినీ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు.

 

ఆ పోస్ట్ ను ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. ఆగస్టు 15 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఆ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here