తల్లి మీద చిరాకు పడి కొట్టబోయిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న నాగార్జున లేటెస్ట్ కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ లోకి లాంచ్ అయిన హీరో అక్కినేని అఖిల్. అక్కినేని నాగార్జున చిన్న కొడుకుగా, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో వెలిగిపోతూ ‘మనం’ సినిమా లో చిన్న గెస్ట్ రోల్ ద్వారా వెండితెరకి పరిచయమైనా అఖిల్ ని చూసి ప్రతీ ఒక్కరు ఇతను భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని అనుకున్నారు. కానీ అతను ఎంట్రీ ఇచ్చిన ముహూర్తం అసలు ఏ మాత్రం బాగలేదేమో.

అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్

ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు దాటుతున్నా కూడా ఇప్పటి వరకు ఆయనకీ ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అక్కినేని ఫ్యాన్స్ అందరూ అఖిల్ విషయం లో చాలా నిరాశతో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అఖిల్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయం ఒకటి నాగార్జున గత కొంత కాలం క్రితం ఒకటి బయటపెట్టాడు.

అప్పాలో ఆయన మాట్లాడుతూ అఖిల్ కి తనతో కంటే కూడా ఎక్కువ కనెక్షన్ ఆయన అమ్మ అమల తోనే ఉంటుందట. ఆమె అఖిల్ తో ఒక తల్లి లాగ కాకుండా ఒక స్నేహితురాలిగా ఉంటుందట. అఖిల్ సినిమాల విషయం తాను అసలు పట్టించుకోనని, అన్నీ వాళ్ళ అమ్మ నే దగ్గరుండి చూసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. అంతే కాదు అఖిల్ కి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు చిరాకు తో అమల గారి మీద అరిచేస్తాడట.

- Advertisement -

ఇదంతా మన ఇంట్లో మన అమ్మతో ఉంటున్న జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది కదూ, ఎంత పెద్ద స్టార్ అయిన తల్లి తో ఇంత క్లోజ్ గా మనలాగే ఉంటారని నాగార్జున మాట్లాడిన ఆ మాటలు వింటే అర్థం అవుతుంది. ఇక అఖిల్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన యోధా అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు. ఇక నుండి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here