ప్రభాసా.. మజాకా.. 200 మంది సింగర్స్, డాన్సర్స్, 50 లక్షల బాణసంచా.. రచ్చే..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో ఫుల్ బిజీగా ఉంది.. ఆదిపురుష్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకేకుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 6 న తిరుపతి లో జరగనుంది. అందుకు గాను ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…

ఆదిపురుష్
ఆదిపురుష్

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా నటించగా, ప్రముఖ బాలివుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి..దాదాపు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు.. ఈ సినిమాను జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..

ఇది ఇలా ఉండగా.. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ముంబాయి నుంచి 200 మంది డ్యాన్సర్లు వస్తున్నారు. అలాగే 200 మంది సింగర్లు రాబోతున్నారు. ఈవెంట్ లో భారీగా బాణాసంచా కాల్చబోతున్నారు. జై శ్రీరామ్ అనే శబ్దం వచ్చే బాణా సంచా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -

ఒక్క బానాసంచ కోసమే దాదాపు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చెయ్యనున్నారని సమాచారం.. ఒక్క టపాసుల కోసమే అంత ఖర్చు చేస్తున్నారంటే ఇక ఈవెంట్ కోసం ఎంత చేస్తారో ఊహించడం కష్టమే..అలాగే గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా తిరుపతి లోనే నిర్వహించారు. దాంతో ఇప్పుడు ఈ ఈవెంట్ ని అదే ప్లేస్ లో ఏర్పాటు చేస్తుండడంతో బాహుబలి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందేమో అని అభిమానులు అంటున్నారు.. ఎలా ఉంటుందో చూడాలి మరి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here