Adah Sharma : ఆత్మహత్య చేసుకొని చనిపోయిన హీరో ఇంటిని కొనుగోలు చేసిన హీరోయిన్ ఆదా శర్మా..!

- Advertisement -

Adah Sharma : పూరి జగన్నాథ్ దర్శకత్వం లో నితిన్ హీరో గా నటించిన ‘హార్ట్ అటాక్’ సినిమా ద్వారా హీరోయిన్ గా పచయమైన ఆదా శర్మ, నటిగా మంచిగా మార్కులు దక్కించుకున్నప్పటికీ ఎందుకో టాలీవుడ్ లో ఆశించిన స్థాయి గుర్తింపుని దక్కించుకోలేకపోయిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మరియు ‘సుబ్రహ్మణ్యం ఫార్ సేల్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

Adah Sharma
Adah Sharma

ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. ఇక ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఈ హాట్ బ్యూటీ ఈ ఏడాది ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో మిస్ అయిన ఆడవాళ్ళ యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇందులో అదా శర్మ అద్బుతంగా నటించింది, ఆమె నటన ప్రతీ ఒక్కరిని కదిలించింది. 2008 వ సంవత్సరాం నుండి ఇండస్ట్రీ లో ఉన్నా కూడా దక్కని గౌరవం, ఆదా శర్మ కి ఈ సినిమాతో దక్కింది. సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చి సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనితో నిర్మాత ఆదా శర్మ కి కలలో కూడా ఊహించని రేంజ్ రెమ్యూనరేషన్ ని ఇచ్చాడు. ఈ రెమ్యూనరేషన్ లోని కొంత భాగాన్ని ఆమె ముంబై లోని ఒక విలాసవంతమైన ఫ్లాట్ ని కొనుగోలు చెయ్యడానికి ఉపయోగించింది.

- Advertisement -

ఈ ఫ్లాట్ లో గతం లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉండేవాడు. ఈ ఫ్లాట్ లోనే ఆయన ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అలాంటి ఫ్లాట్ ని ఆదా శర్మ కొనుగోలు చెయ్యడం ఇప్పుడు బాలీవుడ్ లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఇది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సొంత ఫ్లాట్ కాదు, అతను ఇక్కడ అద్దెకి ఉండే వాడు, ఆ ఫ్లాట్ ఆదా శర్మ కి చూడగానే ఎంతో నచ్చడం తో గతం గురించి పట్టించుకోకుండా కొనుగోలు చేసిందని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here