Shalini Pandey : తెలుగు ప్రేక్షకుల కోసం ఏమైనా చేస్తానంటున్న అర్జున్ రెడ్డి భామ.. పాపం ఇలా అయిపోయిందేంటి..!

- Advertisement -

Shalini Pandey : ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది షాలిని పాండే. తొలి సినిమాతోనే అద్భుత గుర్తింపు తెచ్చుకుంది. ప్రీతి పాత్రలో అమాయకపు అమ్మాయిలా అలరించింది. ఈ సినిమాలో అమ్మడి నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత షాలినికి వరుస అవకాశాలు వచ్చాయి. ‘118’, ‘100 % కాదల్​’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘జయేష్​ భాయ్ జోర్డార్’​ లాంటి సినిమాల్లో మెరిసింది. తెలుగు, హిందీతో పాటు, తమిళంలోనూ ఛాన్సులు వచ్చాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ లో రాణిస్తోంది. చక్కటి నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది.

Shalini Pandey
Shalini Pandey

ప్రస్తుతం ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది. రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అటు బాలీవుడ్ మూవీ ‘మహారాజా’లోనూ కనిపించనుంది. సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు చెప్పింది షాలిని పాండే. ‘అర్జున్ రెడ్డి‘ సినిమాలో అవకాశం రావడం పట్ల ఎంతో సంతోషంగా ఫీలైనట్లు తెలిపింది. తెలుగుతో పాటు హిందీ(‘కబీర్ సింగ్‘) లోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది.

Shalini Pandey Photos

“‘కబీర్ సింగ్’ సినిమాను ఎప్పుడూ రీమేక్ చిత్రంగా చూడలేదు. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీ కెమిస్ట్రీ చక్కగా ఉంది. ప్రీతి క్యారెక్టర్ లో నేను, కియారా చాలా బాగా నటించాం. చక్కటి భావోద్వేగాలను కనబరిచాం. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించాను. ఏదో ఒక భాషలో నటించాలనే పట్టింపు ఏమా లేదు. మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది. నేను తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరపైకి అడుగు పెట్టాను. తెలుగు అమ్మాయిని కాకపోయినా, నా తొలి సినిమాకు ఇక్కడి ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ కనిపించింది. వారి ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను” అని షాలిని పాండే వెల్లడించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here