Actress Kasthuri : విమానంలో రొమాన్స్ ఎలా సాధ్యం.. యానిమల్ పై కొత్త డౌట్లు రేకెత్తించిన నటి కస్తూరి..

- Advertisement -

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబీనేషన్ లో తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’. ఇందులో రణ్ బీర్ కి జంటగా రష్మిక నటించిన విషయం తేలిసిందే. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 1న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ పై భారీ స్థాయిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా బోల్డ్ కంటెంట్ తో పాటు గృహ హింసకు సంబంధించిన సన్నివేషలు ఉండటంతో పురుషులు సైతం ఈ సినిమాను విమర్శించారు.

కానీ, కలెక్షన్స్ పరంగా ఈ మూవీ ఎక్కడ తగ్గలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవలే యానిమల్ సినిమా ఓటీటీలో అలరిస్తున్న సంగతీ తెలిసిందే. ఇక ఈ సినిమా వీక్షించిన ప్రముఖ బుల్లితెర నటి నాకు చాల విసుగొచ్చిందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం యానిమల్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ లో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను కొంతమంది బాగుందని అంటుంటే.. మరికొందరు ఇదేం సినిమా అంటూ తల పట్టేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా బుల్లితర గృహలక్ష్మీ కస్తూరీ సైతం యానిమల్ సినిమా పై సోషల్ మీడియాలో కౌంటర్ల్ వేసింది.

అందులో.. ‘‘లాస్ట్ నైట్ ఈ యానిమల్ మూవీని చూద్దామని స్టార్ట్ చేశా. కానీ, సగం కూడా కాలేదు. అప్పటికే నాకు విసుగొచ్చింది. అసలు ఈ సినిమాను థియేటర్లో జనాలు ఎలా చూశారు, మూడున్నర గంటలు ఎలా ఉన్నారు. ఇక ఆటో ఫ్లైయింగ్ ప్లేన్‌లో ఆ సీన్లు ఏంటి? ప్రేమలో పడటం ఏంటి? మాట్లాడుకునే టైంలోనే అలా అయిపోవడం ఏంటి?.. అసలు వాళ్లు ఎక్కడికి వెళ్లారు. వామ్మో.. నన్ను తప్పుగా తీసుకోకండి. ఈ సినిమాను టాప్ నాచ్‌లో తీశాడు. కానీ, ఆ స్థాయిని మనం అందుకోలేం. అందులో చాలా ఉంది. కానీ.. ఆ సినిమా నన్ను ఎంటర్టైన్ చేయలేదు” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో కౌంటర్లు వేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here