Pallavi Prashanth : ఇటీవల పలు ఆసక్తికర పరిణామాల మధ్య బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ గా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి విజేతగా నిలిచాడు. అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. ఇక ఈ సీజన్లో టైటిల్ విజేతగా నిలవాలని శివాజీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన సలహాలు విని శివాజీని కాకుండా గేమ్ ఆడిన ప్రశాంత్ విజేతగా నిలవడంతో ఇది ఫేక్ ఓటింగ్ అని, శివాజీని ఎలిమినేట్ చేసి ప్రశాంత్ను విజేతగా నిలబెట్టారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

దీనిపై స్పందించిన శివాజీ ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వీడియోలో తనను ఆదరించిన ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన నాగార్జునకు, బిగ్ బాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ను విజేతగా నిలిపిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. అలాంటిదేమీ లేదు. నేను వాటిని నమ్మను. బిగ్ బాస్ వోటింగ్ ఫార్మాట్ను ఉపయోగించే ప్రశాంత్ ని విన్నర్ ను చేశారు.

ఎట్టకేలకు ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే షో స్టార్టింగ్లో ఆయన హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు ఈసారి ఓ సామాన్యుడు టైటిల్ గెలిస్తే బాగుంటుందని అనుకున్నాను.. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. యావర్ కూడా సామాన్యుడే అందుకే మా మధ్య మంచి స్నేహం ఉంది. అంతే కాకుండా గేమ్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు.. అని శివాజీ అన్నారు. ప్రస్తుతం శివాజీ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.