Bigg Boss Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్కు నుండి పల్లవి ప్రశాంత్ అవుట్.. వెక్కిళ్లు పెట్టి ఏడ్చిన భోలే!

- Advertisement -

Bigg Boss Telugu : ప్రతీ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్కు ఎంత ఉత్కంఠ నడుమ సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. గత వారం టాస్కులన్నీ అద్భుతంగా ఆడి గౌతమ్ కృష్ణ ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘వీర సింహాలు’ మరియు ‘గర్జించే పులులు’ టాస్కు ని నిర్వహించారు. ‘గర్జించే పులులు’ టీం లో అమర్ దీప్ , శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అర్జున్ మరియు అశ్వినీ ఉన్నారు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

అలాగే ‘వీర సింహాలు’ టీం లో గౌతమ్ కృష్ణ, భోలే, టేస్టీ తేజా, రతికా, యావర్ మరియు శోభా శెట్టి ఉన్నారు. ఈ టాస్కులో భాగం గా మొదటి రౌండ్ లో బెలూన్స్ ఊడి టైర్లకు తగిలించాలి. ఇందులో వీర సింహాలు టీం నుండి టేస్టీ తేజా మరియు ప్రిన్స్ యావర్ పాల్గొనగా, గర్జించే పులులు టీం నుండి అర్జున్ మరియు పల్లవి ప్రశాంత్ పాల్గొన్నారు.

టేస్టీ తేజా మరియు ప్రిన్స్ యావర్ అద్భుతంగా ఆడి టాస్కులో గెలవగా, పల్లవి ప్రశాంత్ మరియు అర్జున్ ఈ టాస్కులో ఓడిపోయారు. గేమ్ రూల్ ప్రకారం గెలిచిన టీం, ఓడిన టీం లో ఉన్న ఒకర్ని తొలగించాలి. వీర సింహాలు టీం చాలా తెలివిగా పల్లవి ప్రశాంత్ ని టాస్కు నుండి తొలగించింది. దీనికి శివాజీ మరియు భోలే తెగ ఫీల్ అయిపోయారు. భోలే అయితే మూలాన కూర్చొని పల్లవి ప్రశాంత్ ని తప్పించినందుకు వెక్కిళ్లు పెట్టి ఏడ్చేశాడు.

- Advertisement -
Pallavi Prashanth Shivaji Yaawar

తన టీం కాకపోయినా కూడా అవతల టీం లో ఉన్న పల్లవి ప్రశాంత్ ని తొలగించినందుకు భోలే ఏడవడం ఏమిటి?, ఇది మరీ ఓవర్ యాక్షన్ లాగ అనిపించడలేదా? అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. భోలే బిగ్ బాస్ హౌస్ లోకి గెలుద్దామని రాలేదు, పల్లవి ప్రశాంత్ లేదా శివాజీ లలో ఎవరినో ఒకరిని టైటిల్ గెలిచేలా చెయ్యాలని హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఈ విషయం ని భోలే ని అడిగినా అదే చెప్తాడు అంటూ నెటిజెన్స్ సెటైర్లు వేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here