మరింత జోష్ లో బిగ్ బాస్.. హౌస్ లోకి మరో 8 మంది స్టార్ కంటెస్టెంట్స్

- Advertisement -

బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు 6సీజన్లు పూర్తి చేసుకుని 7సీజన్ గత వారమే ప్రారంభమైంది. అంచనాలకు అనుగుణంగా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ షోకు కూడా నాగార్జునే హోస్టుగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి ఈ సీజన్ ఉల్టా పుల్టా ఉంటుందని ఆయన చెప్తూనే ఉన్నారు. చెప్పినట్లుగానే ట్విస్టులు, టాస్క్ లతో సీజన్ కొనసాగుతోంది. ఇక ఈ వీకెండ్ హౌస్ లోకి మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో తొలి వారం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఇందులో అమర్ దీప్, శివాజీ, టెస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, ఆట సందీప్, షకీలా, దామినీ, కిరణ్ రాథోడ్, ప్రియాంక జైన్, రతికా రోజ్, శోభా శెట్టి, శుభ శ్రీ అడుగుపెట్టారు.

బిగ్ బాస్
బిగ్ బాస్

ఇక ఆ 14 మంది కంటెస్టెంట్స్ తో ఈ వారం మొత్తం సరదాగా గడిచిపోయింది. ముఖ్యంగా నటుడు శివాజీ, షకీలా వేసిన డ్రామా షోకే హైలెట్ గా నిలిచింది. శివాజీ బిగ్ బాస్ మీద అరవడం బాగా వర్క్ అవుట్ అయింది. ఇప్పుడు ఈ వీకెండ్ మరో 8మంది ఆ 14మందికి జోడీ కానుకున్నారు. అంతేకాకుండా ఈరోజు షూటింగ్ కూడా జరుపుకుంటుందని సమాచారం.

varshini new photos
varshini new photos

అప్పుడు 22 మంది కంటెస్టెంట్స్ అవుతారు. వారిలో ఎవరైనా ఎలిమినేట్ అయితే 21 మందితో షో నడుస్తుంది. మరి ఈ వారం ఎలిమినేషన్ లేదన్న వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఎలిమినేషన్ గనుక ఉంటే కిరణ్ రాథోడ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షోలోకి వచ్చే 8 మంది ఎవరంటే… అంబటి అర్జున్, వర్షిణి, పవన్ సాయి రాజ్ పుత్, యాక్టర్ క్రాంతి, నిఖిల్, ఐశ్వర్య పిస్సే లేదా పూజా మూర్తి, బోలే షవాలి, ఫర్జానా. మరి వీరు రాకతో షో ఎంత రసవత్తరం అవుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here