నాగార్జున హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది.. అసలు గుర్తుపట్టేకపోతున్నాం

- Advertisement -

గిరిజా శెట్టర్ గుర్తుందా? టాలీవుడ్ బిగ్గెస్ట్ ఆల్ టైం ఫేవరేట్ హీరోయిన్.. మీరు వినే ఉంటారు కానీ.. చాలా ఓల్డ్‌ కావడంతో గుర్తు రావడం లేదుకానీ.. అబ్బాయిలు ఈ హీరోయిన్‌ తప్పకుండా గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఈ హీరోయిన్‌ చెప్పిన డైలాగ్‌ అప్పట్లో ఓ సెన్సేషనల్.. ఆ డైలాగ్‌ ఏంటంటే.. లేచి పోదాం అన్న మగాడా రా.. అంటూ మన్మథుడు నాగార్జునను పిలిచే ఆ సీన్‌ లోని ఆమె అరుపులతో థియేటర్‌‎లో మారుమ్రోగింది. అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిన గీతాంజలి చిన్నది గుర్తుందా.. ఇప్పుడు కచ్చితంగా గుర్తొచ్చే ఉంటుంది. ఆ ఫోటోలో కనిపిస్తున్న తనే ఆ అమ్మాయి.. గుర్తు పట్టలేనంతగా మారిపోయింది కదా. నాగార్జునతో గీతాంజలి సినిమాలో నటించి మంచి పాపులారిటి దక్కించుకుంది. 30 ఏళ్లగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

నాగార్జున
నాగార్జున

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో లవర్స్ కు ఎంతగానో నచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ లో లవ్ స్టోరీ అంటే ఠక్కున్న గుర్తొచ్చే సినిమా గీతాంజలి. అంతలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో హీరోహీరోయిన్ల మధ్య ఎమోషన్లు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించాయి. ఆ సినిమాలో నాగార్జున – గిరిజ నటన‌కి కోట్లాదిమంది ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో గీతాంజలిని చూసిన కుర్రాళ్లంతా ఇలాంటి లవర్ మనకూ ఉంటే ఎంత బాగుంటుంది అనే విధంగా ఆమె నటన, యాటిట్యూడ్ కనెక్ట్ అయ్యాయి. గీతాంజలి సినిమా తర్వాత తను పెద్దగా సినిమాల్లో కనిపించ లేదు. పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి వెండితెరపై వెలిగేందుకు రెడీ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. గిరిజ శెట్టర్ తన కెరీర్లో మొత్తం 5సినిమాల్లో మాత్రమే నటించింది. తాను ఇప్పుడు కన్నడ మూవీలో నటిస్తోంది. ఇబ్బని తబ్బిదా ఇలెయాలి అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here