Naa Saami Ranga : ‘నా సామి రంగ’ క్లైమాక్స్ లో విషాదం..హీరోలిద్దరు చనిపోతారా?

- Advertisement -

Naa Saami Ranga : చాలా కాలం తర్వాత అక్కినేని నాగార్జున సినిమాకి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఎక్కడ లేని హైప్ రావడం ‘నా సామి రంగ’ అనే చిత్రం తోనే చూస్తున్నాం. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఒక దానిని మించి ఒకటి ఎగురుకుంటూ వస్తున్న నాగార్జున కి దాదాపుగా మార్కెట్ మొత్తం పొయ్యింది అని అనుకుంటున్న సమయం లో కమర్షియల్ జానర్ ని ఎంచుకొని ఈ సంక్రాంతికి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు టీజర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా మాస్ సెంటర్స్ నుండి ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత ది బెస్ట్ ఆఫర్స్ ని రప్పించేలా చేశాయి టీజర్ మరియు పాటలు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని మంగళవారం నాడు విడుదల చెయ్యబోతున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ నాగార్జున అనుచరులుగా ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘పోరింజు మారియం జోస్’ అనే చిత్రానికి రీమేక్. ఇందులో క్లైమాక్స్ లో హీరో మరియు హీరో పక్కన ఉండే ముఖ్య అనుచరుడు ఇద్దరు చనిపోతారు.

- Advertisement -

‘నా సామి రంగ’ చిత్రం లో కూడా నాగార్జున మరియు అల్లరి నరేష్ చనిపోతారని టాక్ వినిపిస్తుంది. సినిమాలో ఆ రేంజ్ ట్రాజెడీ ఉంటే మన ఆడియన్స్ తీసుకోగలరా?, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు చేసి నాగార్జున ని బ్రతికించి, అల్లరి నరేష్ పాత్రని లేపేసారా? అనేది తెలియాలంటే ఈ నెల 14 వ తారీఖు వరకు ఆగాల్సిందే. సెన్సార్ కార్యక్రమాలు 11 వ తేదీ, లేదా 12 వ తేదీన పూర్తి అవుతాయని టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here