డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్.. ఈ వారం బిగ్ బాస్ 7 లో ఊహించని ఎలిమినేషన్!

- Advertisement -

వరుసగా ఆరు సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 7 వ సీజన్ లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ రియాలిటీ, మొదటి రోజు నుండే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా అంతకు ముందు సీజన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఎంతో బెటర్ గా ఉన్నారు. ప్రతీ ఒక్కరికి ఆడాలనే కసి బలంగా ఉంది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఎంత వాడివేడి వాతావరణం లో కొనసాగిందో మన అందరికీ తెలిసిందే.

బిగ్ బాస్
బిగ్ బాస్

హౌస్ మేట్స్ ఎక్కువగా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసారు. మొదటి నుండే కామన్ మ్యాన్ గా, రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ కి జనాల్లో మంచి సానుభూతి ఉంది. ఇప్పుడు అతన్ని టార్గెట్ చెయ్యడంతో అతను ఇంకా పవర్ ఫుల్ గా మారిపోయాడు. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ప్రశాంత్ అందరికంటే నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు.

పల్లవి ప్రశాంత్ కాకుండా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఇంటి సభ్యులు అమర్ దీప్, శివాజీ, రతికా, టేస్టీ తేజా, షకీలా, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి మరియు గౌతమ్. వీరిలో ఆన్లైన్ ఓటింగ్స్ ద్వారా ప్రశాంత్ తో పాటుగా సేఫ్ జోన్ లో ఉన్న ఇంటి సభ్యులు అమర్ దీప్, శివాజీ, రతికా, టేస్టీ తేజా. మిగిలిన వాళ్లంతా స్వల్ప ఓట్ల తేడా తో డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ డేంజర్ జోన్ లో ఉన్న ఇంటి సభ్యుల్లో అధిక శాతం షకీలా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -

అంతే కాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కనిపిస్తున్న ప్రిన్స్ యావర్ మరియు గౌతమ్ కృష్ణ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళిద్దరితో ఎవరైనా ఎలిమినేట్ అయితే కచ్చితంగా సోషల్ మీడియా లో పెద్ద రచ్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎలిమినేషన్ ని న్యాయంగా ఎవరూ ఫీల్ అవ్వడం లేదు. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here