34 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్​ను కలిసిన ఆ ముగ్గురు.. వీడియో వైరల్

- Advertisement -

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని ఫొటోలు, వీడియోలు చూస్తుంటే భలే ముచ్చటేస్తుంటుంది. అందులోనూ మనకు నచ్చిన హీరో హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలకు సంబంధించిన పోస్టులైతే మరింతగా నచ్చేస్తుంటాయి. ఇక మనకు నచ్చిన ఇద్దరు వ్యక్తులు చాలా ఏళ్ల తర్వాత ఒకచోట కలిసినప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అలా వారు కలిసినప్పుడు వారికే కాదు వాళ్లు అలా మీట్ అవ్వడం చూసిన మనకూ పాత మధుర జ్ఞాపకాలు మదిలో మెదులుతుంటాయి. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ఆ సినిమా సెట్స్​లో ఉన్నప్పుడు చిరును కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌ కలిసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో సోషల్ మీడియాలో అప్పుడు బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఆ సంగతి ఎందుకంటారా? ఎందుకంటే ఇప్పుడు ఇంకో ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అది అజిత్ ఉన్న ఫొటో కాదు. అజిత్ భార్య షాలిని కూడా చిరుతో ఉన్న ఓ పాత ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్​లో షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పిక్​ను పోస్ట్​ చేయడంతో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోలో శాలినితో పాటు తన చెల్లి శామిలీ, సోదరుడు రిచర్డ్ రిషి కూడా ఉన్నారు.

- Advertisement -

ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక కామెంట్ల వర్షానికి కొదువే లేదు. కొందరు నెటిజన్లు 34 ఏళ్ల తర్వాత వీరంతా ఒక్కచోట కలిశారని కామెంట్లు పెడుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అసలు సంగతి ఏంటంటే? ఈ ఫొటోలు ఉన్న ముగ్గురు (శాలిని, శామిలీ, రిషి) చిన్నప్పుడు చిరంజీవి బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)లో చిరుతో కలిసి నటించినవారే. అంటే దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు మరోసారి మెగాస్టార్‌ను కలిశారన్నమాట. షాలినితో పాటు షామిలి, రిషి కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి షూటింగ్ సమయంలో దిగిన ఫొటోను, ఇప్పుడు తీసుకున్న ఫొటోను కొలైజ్ చేసి నెట్టింట షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షాలిని, షామిలి పెద్దయ్యాక హీరోయిన్లుగా పలు చిత్రాల్లో నటించగా రిషి కూడా తెలుగు, తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో హీరోగా నటించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here