మహేశ్ బాబు ఇంట విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న నమ్రత, సితార

- Advertisement -

మహేష్‌బాబు ఇంట విషాదం తీవ్ర చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మహేశ్ కుమార్తె సితార, ఆయన భార్య నమ్రత సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. ఇంతకు జరిగింది ఏంటంటే… సితార ఏడేళ్లుగా తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క.. ఫ్లూటో చనిపోయిందట. దీంతో దానితో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తల్లి నమ్రతతో కలసి సితార ఎమోషనల్‌ అయ్యారు. దానితో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి భావోద్వేగానికి గురయ్యారు. సితార.. తన పెంపుడు కుక్క ఫ్లూటోతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఏడేళ్ల బంధం.. మిస్‌ యూ అంటూ పోస్ట్‌ చేసింది.

చిన్న పిల్లలు జంతువులను ఎంతలా ప్రేమిస్తారో అందరికీ తెలిసిన విషయమే అందులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి చిన్న గాయం అయితేనే వారు తట్టుకోలేరు. ఆ గాయం నుంచి కోలుకునే వరకు బాధపడతారు. సితార కూడా తన పెంపుడు కుక్క ఫ్లూటో మీద అలాంటి ప్రేమనే చూపించింది. ఏడేళ్లు తనతో ఉండి ప్రస్తుతం చనిపోవడంతో చాలా బాధపడిపోతుంది. కూతురి బాధ చూసిన నమ్రత తనను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ‘‘మన ప్రార్థనల్లో ఫ్లూటో ఎప్పటికీ బతికే ఉంటుంది.. నిన్ను మిస్‌ అవుతాం.. మా హృదయాల్లో ఎప్పటికి నిలిచే ఉంటావు’’ అంటూ నమ్రత కూడా ఫ్లూటో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొందరు నెటిజన్లు సానుభూతి తెలుపుతుంటే మరికొందరు కుక్క చనిపోతే ఇంత హడావుడి అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here