Taraka Ratna : సంచలనం రేపుతున్న డాక్టర్ల రిపోర్టులు.. తారకరత్న చనిపోయి 20 రోజులు దాటిందా?

- Advertisement -

Taraka Ratna : గుండెపోటు తో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న తారకరత్న మొన్ననే తన తుది శ్వాసని వదిలిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసింది. నిన్న ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం లో ఆయన అంత్యక్రియలను పూర్తి చేసారు.ఇదంతా కాసేపు పక్కన పెడితే తారకరత్న గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది.ఎప్పుడైతే ఆయన లోకేష్ పాదయాత్ర లో గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడో, ఆరోజే ఆయన గుండె ఆగిపోయిందని.

Taraka Ratna
Taraka Ratna

డాక్టర్లు సీపీఆర్ చేసిన లాభం లేకుండా పోయిందని,ఒక వార్త సంచలనం రేపింది.అందుకు సంబంధించి డాక్టర్లు రిపోర్ట్స్ కూడా ఇచ్చారట, కానీ లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిపోతుందో అనే భయం తోనే ఈ విషయాన్నీ ఇన్ని రోజులు దాచిపెట్టారని, మృత దేహం పాడు అవ్వకుండా ప్రత్యేకంగా డాక్టర్లను పిలిపించి మ్యానేజ్ చేసారని ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం సాగాయి.

Taraka Ratna Death

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ నాయకురాలు లక్ష్మి పార్వతి కూడా ఒక మాట కలపడం తో ఇది నిజమేనని చాలా మంది నమ్మేలా చేసింది. మరోపక్క తెలుగు దేశం పార్టీ అభిమానులు లక్ష్మి పార్వతి చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా.అసలు చనిపోయిన ఒకమనిషి శరీరాన్ని 20 రోజులకు పైగా పాడు అవ్వకుండా ఎవరైనా చెయ్యగలరా..?, పైగా ఫ్రీజర్ లాంటి చోట్ల కూడా తారకరత్న ని ఉంచలేదు.

- Advertisement -
Docter report on Taraka Ratna death

ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్న ఫోటోలను కూడా ఇదివరకు మనం చాలా చూసాము, ICU లో వెంటిలేటర్ మీద కూడా తారకరత్న ఉన్న ఫోటోలను ఎన్నో చూసాము,ఇలా చావుని కూడా అడ్డుపెట్టుకొని అబాండాలు వేసి రాజకీయం చెయ్యడం అనేది అత్యంత నీచం అంటూ తెలుగు దేశం పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.మరి ఈ వార్తలపై చంద్రబాబు మరియు లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here