Shoba Shetty : సోషల్ మీడియా చూడాలంటేనే భయం వేస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శోభా శెట్టి!

- Advertisement -

Shoba Shetty : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అత్యధిక కంటెంట్ ని ఇచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో శోభా శెట్టి ముందు వరుసలో ఉంటుంది. చాలా స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ అని తన ఆట తీరుతో నిరూపించుకుంది కానీ, నెగటివిటీ ని మాత్రం కలలో కూడా ఊహించని రీతిలో సంపాదించుకుంది శోభా శెట్టి. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ‘కార్తీక దీపం’ సీరియల్ లో మోనిత అనే విలన్ క్యారక్టర్ చేసింది.

Shoba Shetty
Shoba Shetty

ఈ సీరియల్ లో ఆమె పోషించిన విలన్ క్యారక్టర్ ప్రభావమో ఏమో కానీ, ఆడియన్స్ ఆమె ప్రవర్తనని పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. ఆమె ఏమి చేసినా నెగటివిటీ ఒక రేంజ్ లో వ్యాప్తి చెందింది. కేవలం ఈమె వల్లనే మంచి స్నేహితులుగా ఉంటున్న అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య గొడవలు చెలరేగాయని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుకుంటున్న మాట.

Shoba Shetty Photos

ఇకపోతే హౌస్ నుండి ఆమె బయటకి వచ్చే చివరి వారం లో శివాజీ తో పెట్టుకున్న ఒక గొడవ ఆమె పై జనాలు దాడి చేసే రేంజ్ కోపాన్ని రప్పించింది. వెళ్ళేటప్పుడు శివాజీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పింది కానీ, ఆమెపై నెగటివిటీ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఇటీవల ఆమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్ లో కూడా సోషల్ మీడియా లో తన మీద ఏర్పడిన నెగటివిటీ గురించి యాంకర్స్ అడగగా, దానికి ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -
Shoba Shetty Stills

ఆమె మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఇవన్నీ చూసి చూసి అలసిపోయాను. ఇకమీదట నాకు వాదించే శక్తి లేదు, నెగటివిటీ ని మైండ్ లోకి తీసుకునే ఓపిక కూడా లేదు. అసలు సోషల్ మీడియా లో ఏమి జరిగిందో నాకు తెలియదు, ఇప్పటి వరకు అసలు ఓపెన్ చెయ్యలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా బయట ఏమి జరిగిందో చెప్పట్లేదు’ అంటూ శోభా శెట్టి చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here