Shilpa Shetty : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి అయోధ్య రామ మందిరాన్ని విజయవంతం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది మంది భారత ప్రజల కలలను నెరవేర్చాలనే ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో పాటు 500 ఏళ్ల చరిత్రను ప్రధాని నరేంద్ర మోడీ మార్చారని శిల్పాశెట్టి లేఖలో రాశారు. శిల్పాశెట్టి లేఖను భారతీయ జనతా పార్టీ (మహారాష్ట్ర) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.. అందులో ఆమె.. ‘గౌరవనీయులైన మోడీజీ, కొందరు చరిత్రను చదువుతారు. కొంతమంది చరిత్ర నుండి నేర్చుకుంటారు. కానీ నీలాంటి వాళ్లు చరిత్ర మార్చేస్తారు. 500 ఏళ్ల రామజన్మభూమి చరిత్రను మీరు మార్చారు. నా హృదయం నుండి ధన్యవాదాలు. ఈ శుభ కార్యంతో మీ పేరు కూడా భవిష్యతులో భగవంతుడు శ్రీరాముని నామంతో ముడిపడి ఉంది. నమో రామ్! జై శ్రీ రామ్!’ అంటూ రాసుకొచ్చారు

గత నెల జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. దీనిలో అన్ని రంగాల నుండి అనుభవజ్ఞులు పాల్గొనడానికి ఆహ్వానించబడ్డారు. ఈ మతపరమైన వేడుకలో బాలీవుడ్ నుండి టీవీ ప్రపంచం వరకు చాలా మంది తారలు కూడా పాల్గొన్నారు. అరుణ్ గోవిల్, సునీల్ లాహిరి, దీపికా చిక్లియా, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అభిషేక్ బచ్చన్, రణ్బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అనుపమ్ ఖేర్, వివేక్ ఒబెరాయ్, హేమ మాలిని, రోహిత్ శెట్టి, మాధురీ దీక్షిత్ నే ప్రణ్ణ దీక్షిత్ కార్యక్రమంలో రాజ్కుమార్ హిరానీ, కైలాష్ ఖేర్, రామ్ చరణ్, మనోజ్ జోషి ఇంకా చాలా మంది స్టార్స్ వచ్చారు. ఇది కాకుండా, చాలా మంది బాలీవుడ్ తారలకు ఆహ్వానాలు పంపబడ్డాయి. కాని కొన్ని కారణాల వల్ల వారు ప్రాణ ప్రతిష్టకు హాజరు కాలేకపోయారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, అక్షయ్ కుమార్, ఇతర తారలు ఈ జాబితాలో ఉన్నారు.
