మీరు అలా చేయడం నాకు తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తుంది దయచేసి అర్ధం చేసుకోండి… సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ ట్వీట్…

- Advertisement -

విరుపాక్షతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో చిత్రంలో నటించారు. ఎటువంటి హడావిడి లేకుండా వచ్చినప్పటికీ బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. దీంతో గత రెండు మూడు రోజులుగా ఏపీలో సక్సెస్ టూర్ కి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ తిరిగి వచ్చిన తర్వాత ఒక ఎమోషనల్ మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ మెసేజ్ బాగా వైరల్ అయింది.బ్రో విషయంలో భాగం పంచుకున్న అభిమానులకు అందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని కలుసుకోవడం, నీ ప్రేమను పొందడం, సినిమా గురించి మీ నోటి గుండా వినడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్

అయితే నన్ను కలవడానికి వచ్చిన అభిమానులు ఫోటోలు, సెల్ఫీలు అంటూ ఆప్యాయంగా దగ్గరికి వస్తున్నారు.అందులో మీ అభిమానమే దాగి ఉంది అది మాకు బాగా తెలుసు.నేను కూడా వీలైనంతవరకు అభిమానులకు అందుబాటులో ఉండడానికే ప్రయత్నిస్తాను. కానీ సక్సెస్ మీట్ కు వెళ్ళినప్పుడు చాలామంది అభిమానులు తలకు హెల్మెట్ కూడా ధరించకుండా బైకులలో మమ్మల్ని ఫాలో చేయడం లాంటివి చేస్తున్నారు.

ఇలాంటివి చూసినప్పుడు నాకు తీవ్రమైన భయాందోళనలు కలుగుతున్నాయి. కళ్ళ ముందు అభిమానులకు ఏమన్నా జరిగితే చూసి భరించడం నా వల్ల కాదు.ఆల్రెడీ నేను జీవితంలో ఎటువంటి ఒక సంఘటన ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను. కాబట్టి నాకు ప్రాణం విలువ తెలుసు.

- Advertisement -

బైక్ మీద వెళ్లేటప్పుడు తప్పకుండా మీరు హెల్మెట్ ధరించడం మర్చిపోకండి. ఎప్పటికీ మీ ప్రేమ పొందే అవకాశాన్ని నాకు ఇవ్వండి. దయచేసి మీరందరూ నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అని సాయి ధరమ్ తేజ్ ఒక ఎమోషనల్ ఫీట్ పెట్టారు. తన అభిమానుల గురించి సాయి ధరమ్ తేజ్ ఎంత పర్టికులర్ గా ఉంటారో తెలుసుకుని ఆయన అభిమానులంతా సంతోషిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com