Big Boss : బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రీ ఎంట్రీ..వచ్చిన రోజే గొడవలు పెట్టేసిందిగా..!

- Advertisement -

Big Boss : ఈ సీజన్ బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు చూస్తే బీపీ పేషెంట్స్ కి గుండెలు ఆగిపోవడం పక్కా అని చెప్పొచ్చు. ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వడం ఈమధ్య ఎక్కువ అయిపోయింది. ఇప్పటి వరకు ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా 5 మంది కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు పంపిన సంగతి అందరికీ తెలిసిందే.

Big Boss
Big Boss

ఈ 5 మందిలో ముగ్గురు నామినేషన్స్ లోకి రాగా, నయనీ పావని ఎలిమినేట్ అయ్యింది. ఇది ఇలా ఉండగా, మొదటి 5 వారాల్లో ఎలిమినేట్ అయిన 5 మంది కంటెస్టెంట్స్ లో ముగ్గురిని ఎంచుకొని, ఆ ముగ్గురిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ద్వారా ఒకరిని లోపలకు పంపే కార్యక్రమం బిగ్ బాస్ తలపెట్టిన సంగతి మన అందరికీ తెల్సిందే. నిన్న ఒక బ్యాలట్ బాక్స్ ని ఏర్పాటు చేసి, అందులో కంటెస్టెంట్స్ చేత ఓట్స్ వేయించాడు నాగార్జున.

ఈ బ్యాలట్ బాక్స్ లో కంటెస్టెంట్స్ అందరూ ఎవరికీ ఎక్కువ ఓట్లు వేసి ఉంటే వాళ్ళు హౌస్ లోకి అడుగుపెడుతారని హౌస్ మేట్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ నాగార్జున మరో ట్విస్టు ఇస్తూ ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో, వాళ్ళు మాత్రమే హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అని చెప్తాడు. శుభ శ్రీ, దామిని మరియు రతికా ఈ ముగ్గురిలో శుభశ్రీ మరియు దామిని ఇద్దరికీ కూడా ఇంట్లో స్నేహితులు ఉన్నారు.

- Advertisement -

కానీ రతికా మాత్రం అందరికీ శత్రువే, ఈమె హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో గొడవలు పడింది. కాబట్టి రతికా కి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి,ఆమెనే బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని టాక్. హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే ఈసారి ఈమె గొడవలు పెట్టుకుంటుందా?, లేదా అందరితో కలిసిపోయి మంచి గా ప్రవర్తిస్తుందా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here