Prithviraj Sukumaran : చిరంజీవికి నో చెప్పి.. మహేష్ బాబుకు గ్రీన్ సిగ్నల్.. ఏంటి నిజమా?

- Advertisement -

Prithviraj Sukumaran : గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత జక్కన్నతో సినిమా రాబోతుందని గతంలో ఎప్పుడో ప్రకటించారు.. మహేష్ బాబు 29 వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.. రాజమౌళితో సినిమాలు అంటే ఎంత ఆలస్యంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు.. ఎప్పుడూ మొదలవుతాయో.. ఎప్పుడు పూర్తి అవుతాయో చెప్పడం కష్టమే.. జక్కన్న సినిమాల్లో హీరోలకే కాదు.. రాజమౌళి సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో.. విలన్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తెరపైకి వచ్చింది.. ఈ విలన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Prithviraj Sukumaran
Prithviraj Sukumaran

దర్శకుడిగా, హీరోగా మాలీవుడ్‌లో పృథ్వీరాజ్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి అంతటి వాడు సైరాలో అడిగితే చేయలేదు. గాడ్ ఫాదర్‌కు దర్శకత్వం వహించమంటే కుదరదన్నాడు. తన సినిమాలతో బిజీగా ఉండటంతో చిరుకి నో చెప్పాడట.. అయితే మహేష్ సినిమాలో విలన్ గా చెయ్యడానికి ఒప్పుకున్నాడు.. ఈ విషయం మెగా ఫ్యాన్స్ కు మింగుడు పడలేదు.. దీనిపై కోపంతో ఊగిపోతున్నారు.. చిరుకి నో చెప్పి, మహేష్ కు ఎస్ చెప్పడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఇక ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ SSMB 29 మీద ఫోకస్ పడింది. ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్‌కి తగ్గట్టునే హాలీవుడ్, అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీయబోతోన్నాడు.. ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ ను కూడా పూర్తిగా మార్చేశాడు.. జుట్టుని పెంచుకుంటున్నాడు. హెయిర్ స్టైల్ పూర్తిగా మారబోతోంది. లుక్ మాత్రం డిఫరెంట్‌గా, ఇది వరకెన్నడూ చూడని విధంగా ఉంటుంది.. మరి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా అని ప్రిన్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here