Rajinikanth : రజినీ కాంత్ మనవడికి పోలీసుల కోటింగ్..అసలు ఏమి జరిగిందంటే!

- Advertisement -

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ మనవడు అనగా హీరో ధనుష్ – ఐశ్వర్య పెద్ద కొడుకు యాత్ర రాజా కి తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. నాగ వీధుల్లో సూపర్ బైక్ తో మితిమీరిన వేగంతో వెళ్లడమే కాకుండా, హెల్మెట్ ధరించకపోవడం తో ఆయనకీ వెయ్యి రూపాయిల జరిమానా వేధించి, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారట.

Rajinikanth
Rajinikanth

గొప్ప స్థాయి లో ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన సెలెబ్రిటీల కుటుంబాలే ఇలా నియమాలు పాటించకపోతే వారిని అభిమానించే వాళ్ళు ఏమి పాటిస్తారు?, వీళ్ళ నుండి వాళ్ళు ఏమి నేర్చుకుంటారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రజినీకాంత్ దగ్గర నుండి, ధనుష్ మరియు ఐశ్వర్య వరకు ఎవ్వరూ కూడా ఇలా హెల్మెట్ లేకుండా మితిమీరిన వేగంతో బండి నడపడం ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధం అనే విషయం చెప్పలేదా?, అవన్నీ చెప్పకుండానే పెంచారా అంటూ తిడుతున్నారు.

ఇది ఇలా ఉండగా ధనుష్ మరియు ఐశ్వర్య విడిపోయి చాలా కాలం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరికీ ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా దాంపత్య జీవితం కొనసాగించిన ఈ ఇద్దరు విడిపోవడం కోలీవుడ్ లో పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. మళ్లీ వీళ్ళిద్దరూ కలుస్తారు అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. కేవలం కెరీర్స్ కోసమే కొంత కాలం దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఇకపోతే ధనుష్ వరుసగా తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఆయన తెలుగు లో కూడా ‘సార్’ అనే చిత్రం తో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ అనే చిత్రం తో సంక్రాంతికి మన ముందుకు రాబోతున్న ధనుష్, అతి త్వరలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here