Pawan Kalyan : మెగా ఫ్యామిలీలో వార్ షురూ.. యుద్ధానికి తెరలేపిన సాయిధరమ్ తేజ్..ఏమైందంటే ?

- Advertisement -

Pawan Kalyan : ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో కూడా మనందరికీ బాగా తెలుసు. మరి ముఖ్యంగా తన మామయ్య జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఒక ట్వీట్ చేసి.. తర్వాత జనసేన, టీడీపీలకి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకు సపోర్ట్ చేస్తూ నంద్యాల అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించాడు అల్లు అర్జున్. అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ పవన్ అభిమానులు అల్లు అర్జున్ పై విపరీతంగా కోపంగా ఉన్నారు. ఈ క్రమంలో పాత విషయాలన్నీ తీసి బన్నీపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.

అంతేనా అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవి ఓడిపోవడం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం .. అల్లు అర్జున్ కు ఆయన ఫేస్ మాడిపోయేలా చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గెలిచినందుకు అల్లు అర్జున్ విష్ చేసిన కూడా ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వలేదు. అంతేనా మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా ఇచ్చిన వెల్కమ్ సెలబ్రేషన్స్ లో సైతం అల్లు ఫ్యామిలీ లేదు. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా అల్లు ఫ్యామిలీ లేదు. దీంతో సోషల్ మీడియాలో జనాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

- Advertisement -

ఇదే క్రమంలో తెరపై మరొక న్యూస్ వైరల్ గా అవుతోంది . అల్లు అర్జున్ ని మెగా హీరో సాయి ధరంతేజ్ తన ఇన్ స్టాలో అన్ ఫాలో చేశాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. స్నేహ రెడ్డిని కూడా సాయిధర్మతేజ్ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసినట్లు వార్త బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ మెగా ఫాన్స్ మాత్రం వెరీ గుడ్ సాయిధరమ్ తేజ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు . పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగానే మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందంటూ ప్రచారం జరుగుతుంది .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here