పవన్ కళ్యాణ్​ కు అస్వస్థత.. తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్​

- Advertisement -

స్టార్ హీరో, జన సేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. జనసేనాని పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ ఉపవాస దీక్షలో ఉండటంతో నీరసంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మంగళవారం ఉదయం జరగాల్సిన భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పవన్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.

పవన్ కళ్యాణ్​
పవన్ కళ్యాణ్​

పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది చిన్న సమస్య మాత్రమేనని జనసేన పార్టీ నేతల సమాచారం. దీంతో అభిమానులు కాస్త షాకయ్యారని, సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వెంటనే వారాహి విజయ యాత్రను ప్రారంభించారు. పవన్ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటిస్తున్నారు.

pawan kalyan

ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా కూడా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది వరకు పవన్ కళ్యాణ్ సినిమాలను ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here