Pawan Kalyan: ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా గడుపుతున్నాడో ప్రతీ రోజు మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. తన మంత్రిత్వ శాఖ అధికారులతో ప్రతీ రోజు సమీక్షలు జరుపుతూ, తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తన మార్క్ చూపిస్తున్నాడు. అలాగే మరోపక్క పెండింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ మూడు సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఓజీ, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ మొత్తం 50 శాతం కి పైగా పూర్తి అయ్యాయి. వీటిల్లో ముందుగా హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఆగస్టు నుండి ఆయన షూటింగ్స్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ బయట ఎక్కడికి వెళ్లినా కూడా తన భార్య అన్నా లెజినోవా ని తన వెంట తీసుకొని వెళ్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా ఆయన తన భార్య ని తన వెంట తీసుకెళ్లాడు. ఇకపోతే రీసెంట్ అన్నా లెజినోవా కి సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా లభించింది. ఈ కార్యక్రమం కోసం ఆయన సింగపూర్ కి వెళ్లారు. అన్నా లెజినోవా కి ఇది రెండవ మాస్టర్స్ డిగ్రీ అట. నేడు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె ఈ పట్టా ని స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు.
మాస్టర్స్ పొందినందుకు ఎంతో సంతోషించిన పవన్ కళ్యాణ్ ఆమెకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నా తో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉండగా అన్నా కొణిదెల రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను తొలుత డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్లోని చులాలాంగ్కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్లో శ్రీమతి అనా గారు మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.