Pallavi Prashanth : అన్నం కూడా తిననివ్వడం లేదు.. గెలిచాను అనే అనందం కూడా లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్!

- Advertisement -

Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 లో టైటిల్ విన్నర్ గా గెలిచి సామాన్యుడిగా, ఒక రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ చరిత్ర తిరగరాసాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు అన్నా, అక్కా అంటూ ఎంతో వినయంగా వ్యవహరిస్తూ వచ్చిన పల్లవి ప్రశాంత్. హౌస్ నుండి బయటకి రాగానే ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురి అయ్యేలా చేసింది.

Pallavi Prashanth
Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్ అభిమానులు కూడా ఇదేమి ప్రవర్తన అంటూ పెదవి విరిచారు. ఇది ఇలా ఉండగా నిన్న పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లిన కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ తో చాలా అసభ్య పదజాలం తో బూతులు తిడుతూ ప్రశాంత్ వ్యవహరించాడని. అతని తీరు ని చూసి అసహ్యం వేసింది అంటూ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ శివ వంటి వారు ఇంస్టాగ్రామ్ లో నేరుగా చెప్పుకొచ్చారు.

కేవలం శివ మాత్రమే కాదు, మరో ఇద్దరు ముగ్గురు యాంకర్స్ పట్ల కూడా ప్రశాంత్ ఇదే విధంగా ప్రవర్తించడం తో అందరూ ఒక్కసారిగా ప్రశాంత్ పై సోషల్ మీడియా లో దాడి చేసారు. తన పై నెగటివిటీ ఒక రేంజ్ లో వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్నీ గమనించిన ప్రశాంత్ నిన్న సాయంత్రం ఒక వీడియో చేసి సోషల్ మీడియా లో తనపై జరుగుతున్నా నెగిటివిటీ గురించి చెప్పుకొచ్చాడు.

- Advertisement -
Pallavi Prashanth

ఆయన మాట్లాడుతూ ‘ నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కడుపుకు ముద్ద అన్నం కూడా తినలేదు. నాకోసం పక్క ఊర్ల నుండి వేలాది మందిగా తరలి వస్తున్నారు. 70 యూట్యూబ్ చానెల్స్ కి సంబంధించిన వారు ఇంటర్వ్యూస్ ఇవ్వాలని పట్టి పీడించారు. నేను కూడా మనిషినే, దయచేసి కాసేపు లాగండి అని మాత్రమే చెప్పాను, దానిని వక్రీకరిమ్చి వేరే అర్థం వచ్చేలాగా సోషల్ మీడియా లో ప్రొజెక్ట్ చేస్తున్నారు’ అంటూ పల్లవి ప్రశాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here