Taapsee Pannu : నేను ఆ హీరోయిన్ కు అప్ గ్రేడ్ వెర్షన్ అందుకే నాకు సినిమా ఛాన్స్ లు.. తాప్సీ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

Taapsee Pannu : తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది హీరోయిన్ తాప్సీ పన్నూ. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత మిస్టర్ ఫర్‌ఫెక్ట్, దరువు, మొగుడు, సాహసం, షాడో వంటి సినిమాల్లో నటించింది. అతి తక్కువ టైంలోనే స్టార్ డమ్ అందుకుంది. రవితేజ, ప్రభాస్, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

కెరీర్ మొదట్లో ఈ బ్యూటీకి అన్నీ సెకండ్ హీరోయిన్ ఛాన్సులే వచ్చాయి. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. కొన్నాళ్లుగా హిందీలో సినిమాలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. చివరగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రంలో కనిపించిన తాప్సీ.. ఇటీవలే తన ప్రియుడు బ్యాండ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సిరీస్ చేస్తూ దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత తాప్సీ మూవీ, అవార్డ్స్ ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తుంది.

Taapsee Pannu
Taapsee Pannu

ఇదిలా ఉండగా ఇటీవల ఓ కార్యక్రమంలో త‌న బాలీవుడ్ సినీ కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విషయాలు పంచుకుంది. న‌టి ప్రీతి జింతాకు నేను అప్ గ్రేడ్ వెర్షన్ అని చాలా చాలా సంద‌ర్భాల్లో త‌నకు చెబుతుంటార‌ని.. అది నిజ‌మేన‌ని అన్నారు. ఆ విష‌యంగానే నేను బాలీవుడ్‌లో నిల‌దొక్కుకోగ‌లిగాన‌ని, వ‌రుస‌గా సినిమాల్లో అవకాశాలు ద‌క్కించుకోగ‌లుగుతున్నానంటూ చెప్పుకొచ్చింది. దీనంత‌టికీ కార‌ణం పాజిటివిటీ అని అన్నారు. ప్రీతి జింతా మాదిరి నాకు ఈ పాజిటివ్ నెస్ చాలా ఎక్కువ అని ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటాన‌ని స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం తాప్సీ హసీనా దిల్ రూబా చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఫిర్ అయి మసీనా దిల్‌రూబా సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here