Big Boss : మరోసారి అడ్డంగా దొరికిపోయిన శివాజీ..వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

- Advertisement -

Big Boss : బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం శివాజీ ఆట తీరు ని మెజారిటీ ఆడియన్స్ నచ్చుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణం ఆయనేమి గొప్ప ఆటగాడు అని కాదు. హౌస్ లో అతనికంటే గొప్పగా ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే మాటకారి తత్త్వం ఉండడమే అని చెప్పొచ్చు.

Big Boss
Big Boss

ఎందుకంటే హౌస్ లో మిగతా వాళ్ళు తప్పులు చేస్తే చాలా తేలికగా దొరికిపోయారు. కానీ శివాజీ మాత్రం తన తప్పుని కూడా ఒప్పు అనిపించేలా తన మాటలతో మాయ చేస్తాడు. ఇదే అతనిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ. దానికి తోడు స్టార్ మా ఛానల్ కూడా ఇతను మాట్లాడిన మాటలను వీడియోస్ వేసి వీకెండ్స్ లో చూపించడం లేదు. అమర్ దీప్ మీద మరియు ప్రియాంక జైన్, శోభా శెట్టి మీద ఇతను చేసిన కామెంట్స్ ని జనాలకు చూపిస్తే ఛీ కొడుతారు.

మొన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో అమర్ దీప్ ని నామినేట్ చేయనందుకు శివాజీ బ్యాచ్ తెగ ఫీల్ అయిపోయింది. శివాజీ అయితే ఎర్రోడి లెక్క ప్రవర్తించాడు. ‘రాజమాతలు..మీకు మూతలు మిగిలిపోతాయి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీనిని నాగార్జున నిన్న జరిగిన ఎపిసోడ్ లో వేసి చూపించి శివాజీ ని ఏమిటిది అని అడుగుతాడు. అప్పుడు శివాజీ ‘అయ్యో నేను అది సరదాగా అన్న మాటలు బాబు గారు’ అని కవర్ చేసుకుంటాడు.

- Advertisement -

సరదాగా అయినా అలాంటి మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు, ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని నాగార్జున వార్నింగ్ ఇస్తాడు. శివాజీ సరదాగా ఆ మాటలు అన్నాడో, లేకపోతే సీరియస్ గా ఆ మాటలు అన్నాడో తెలుసుకోలేనంత అమాయకులు కాదు జనాలు. ఇదే కాదు అమర్ దీప్ ని ఆయన అన్న అన్నీ మాటలు చూస్తే అతనికి ఉన్న కుళ్ళు ఏంటో జనాలకు తెలుస్తాది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here