Namrata Shirodkar ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో మహేష్ – నమ్రత జంట కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ లో వరుసగా క్రేజీ ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో, తెలుగులో ఆమె మహేష్ బాబు తో వంశీ చిత్రంలో నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ, మహేష్ – నమ్రత మధ్య మంచి సాన్నిహిత్యం మాత్రం పెంచింది. ఈ చిత్రం నుండి మొదలైన సాన్నిహిత్యం 5 ఏళ్ళ వరకు కొనసాగించి, ఆ తర్వాత ఇండస్ట్రీ లో ఎవరికీ తెలియకుండా కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న సంఘటన మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి జరిగి దాదాపుగా 20 ఏళ్ళు అవుతుంది. ఈ దంపతులిద్దరికీ సితార, గౌతమ్ అని ఇద్దరు సంతానం ఉన్నారు.
వీళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు బాగా సుపరిచితమే. అయితే పెళ్లి తర్వాత మహేష్ కి ఇచ్చిన మాట ప్రకారం నమ్రత శిరోద్కర్ సినిమాలను పూర్తిగా మానేసింది. కేవలం ఇంటి బాధ్యతలు, మహేష్ వ్యాపారాలను చూసుకుంటూ ఒక సాధారణ గృహిణి గా తన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఇక నుండి ఆమె సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆమె ఒక యంగ్ హీరో సినిమాలో ముఖ్య పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నటిగా మళ్ళీ దూసుకుపోవాలని కోరికలేవి ఆమెకి లేవు కానీ, ఆ దర్శకుడు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెయ్యడంతో ఆ చిత్రం లో నటించేందుకు ఒప్పుకుందట నమ్రత.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. తొలుత ఆమె బుల్లితెర రియాలిటీ షోస్ లో జడ్జీ గా వ్యవహరించేది, ఆ తర్వాత గత ఏడాది విడుదలైన రవితేజ పీరియాడికల్ మూవీ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత కూడా ఆమె పవర్ ఫుల్ రోల్స్, నటనకి ప్రాధాన్యం ఉన్న రోల్స్ వస్తే చెయ్యడానికి సిద్ధం అంటుంది. మరి నమ్రత కూడా రేణు దేశాయ్ తరహాలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తుందా, లేదా కేవలం ఒక్క సినిమాతో సరిపెడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నమ్రత ఇప్పుడు పోషించబోయే పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.