Manam : మరో సారి పెళ్లి.. హాజరైన నాగచైతన్య, సమంత.. భారీగా హాజరైన అభిమానులు

- Advertisement -

Manam : సమంత, అక్కినేని అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించిన ఫ్యామిలీ మూవీ ‘మనం’. ఈ సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఇందులో నాగచైతన్య, సమంత మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అందులో వారి కెమిస్త్రీ చూసిన వారు వావ్ అనేలా ఉంది. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా థియేటర్స్‌లో నాగచైతన్య, సమంత ను చూసే అవకాశం వచ్చిందనే చెప్పాలి. ఇక డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో పునర్జన్మల కాన్సెప్ట్ తో ప్రేమను మిక్స్ చేస్తూ వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రికార్డ్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇందులో అక్కినేని నాగేశ్వర్ రావు, నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, సమంత, శ్రియ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, ఈ మూవీ విడుదలై నేటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనం సినిమాను రీరిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమాను తమ అభిమానులతో వీక్షించడానికి అక్కినేని నాగచైతన్య థియేటర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షోకు హాజరయ్యారు. దీంతో చైతూ అభిమానులు, డైరెక్టర్ విక్రమ్‌ కుమార్ తో కలిసి సినిమాను చూశారు. ఇక ఈ సినిమా థియేటర్లో రిలీజ్‌ కావడంతో అభిమానుల హడావుడి మాములుగా లేదు. నాగచైతన్య, సమంత సన్నివేశాలు వచ్చినప్పుడల్లా థియేటర్స్ సందడిగా అరుపులు కేకలతో మార్మోగిపోయాయి. మరీ ముఖ్యంగా వీరి మధ్య కెమిస్ట్రీ సీన్, పెళ్లి సీన్ వచ్చినప్పుడు అభిమానులు స్క్రీన్ దగ్గరకు వెళ్లి మరీ హంగామా చేశారు. మరీ ముఖ్యంగా సమంతతో నాగ చైతన్య పెళ్లి సన్నివేశం రాగానే వాళ్ల ఫ్యాన్స్ సీట్లలోనుంచి లేచి గంతులేస్తూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ముందే అభిమానులు గోల చేస్తున్నారు. పెళ్లి సీన్ కి అభిమానులు హంగామా చేస్తుండడంతో చైతు వారిని కూర్చోమని చెబుతూ చిరాకు పడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here