Manchu Laxmi : మోహన్ బాబు, ప్రభాస్ ఆడవాళ్లలా అలా చేస్తారు.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Manchu Laxmi : మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా అందరికీ సుపరిచితమే. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది మంచు లక్ష్మి. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Manchu Laxmi
Manchu Laxmi

వైవిధ్యమైన పాత్రలల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం పాటు అడపాదడపా సినిమా ఇండస్ట్రీలో కొనసాగింది. కానీ ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి సోషల్ మీడియాకు అంకితం అయింది. వయస్సుతో సంబంధం లేకుండా హద్దులు చెరిపేసి హీరోయిన్స్‌ను మించిని గ్లామర్ షో చేసింది. దీంతో అవి చూసిన నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు. అయినా పట్టించుకోకుండా వరుస పోస్టులతో నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంది. ఇటీవల మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ప్రభాస్, మోహన్ బాబు గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. ‘‘మా నాన్న ప్రభాస్ ఫోన్ చేసుకుని వంటల గురించి మాట్లాడుకుంటారు. ప్రభాస్ ఆహార ప్రియుడు అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే మా నాన్న కూడా అంతే. ఇక ఈ ఇష్టంతోనే వీరిద్దరు ఖాళీ సమయంలో ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుని ఆడవాళ్ళ లాగా వంటల గురించి మాట్లాడుకుంటారు. మీ ఇంట్లో ఏ కూర అంటే మీ ఇంట్లో ఏం కూర అని అడిగి తెలుసుకుంటారు. అంతే కాకుండా పంపించుకుంటారు కూడా. కొన్ని వంటలు మాత్రం ఎలా తయారుచేస్తారో తెలుసుకుంటారు. వీరిద్దరు బుజ్జిగాడు మూవీ చేసినప్పటికీ నుంచి ఇలా ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here