Mannara Chopra : మళ్లీ తెరపైకి దర్శకుడి ముద్దు.. మేమంతే ఉంటామని తెగేసి చెప్పిన మన్నారా చోప్రా..

- Advertisement -

Mannara Chopra : హీరోయిన్లు ప్రియాంక చోప్రా, ప‌రిణితీ చోప్రాల‌ కజిన్ మన్నారా చోప్రా తెలుగు వారికి కూడా సుపరిచితమే. సునీల్ సరసన ‘జక్కన్న’, సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘తిక్క’ సినిమాలు చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘రోగ్’.. డైరెక్టర్ తేజ తెరకెక్కిన ‘సీత’ సినిమాల్లో నటించింది. కానీ అమ్మడికి ఏమాత్రం అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ భామ..

Mannara Chopra
Mannara Chopra

‘తిర‌గ‌బ‌డ‌రా సామీ’ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే ఇంతలోనే హిందీ ‘బిగ్‌ బాస్’ సీజన్ 17 లో కంటెస్టెంట్‌ గా పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్‌ త‌రుణ్, మ‌న్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తిర‌గ‌బ‌డ‌రా సామీ’. ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌ లో దర్శకుడు అకస్మాత్తుగా మన్నారా చెంపపై ముద్దు పెట్టుకున్నాడు. ప‌బ్లిక్‌ గా హీరోయిన్‌ ను రవి కుమార్ ముద్దు పెట్టుకోవడంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కూతురు వయసున్న అమ్మాయితో మీడియా ముఖంగా అలా అసభ్యకరంగా బిహేవ్ చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనుకోని విధంగా మన్నారా చోప్రా కూడా వార్తల్లో నిలిచింది.

Mannara Chopra Photos

‘బిగ్ బాస్-17’ ప్రీమియర్ ఎపిసోడ్‌లో మన్నారా కాంట్రవర్సీ కిస్ గురించి మాట్లాడుతూ.. దాని వెనుక తప్పుడు ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. డైరెక్ట‌ర్ ర‌వి కుమార్ చౌద‌రి చాలా రోజుల త‌ర్వాత త‌న‌ను కలుసుకోవడంతో, సంతోషంలో అలా త‌న చెంప‌పై ముద్దు పెట్టార‌ని మన్నారా చోప్రా తెలిపింది. తాము స్నేహితులుగా ఎంతో సన్నిహితంగా మెలిగే వాళ్లమని, ర‌వికుమార్ త‌న‌కు తండ్రితో స‌మాన‌మ‌ని చెప్పింది.”నా సినిమా ప్రమోషన్ ఊహించని మలుపు తిరుగుతుందని నాకు తెలియదు. నేను వ్యక్తపరచాలనుకుంటున్న ప్రతిదీ ఇప్పటికే చెప్పేసాను. దీని గురించి ఇంతకంటే మాట్లాడటానికి నేను సిద్ధంగా లేను” అని రాసుకొచ్చింది మన్నారా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here