Manchu Laxmi : ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది..మంచు లక్ష్మి గురించి అయితే చెప్పనక్కర్లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో అభిమానులతో తన విషయాలను గురించి ముచ్చటిస్తుంది.. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..వాటికి ఎన్ని ట్రోల్స్ వచ్చిన పెద్దగా పట్టించుకోదు.. అది కూడా పాపులారిటిని పెంచుతున్నాయని అంటుంది మంచు వారమ్మాయి.. అయితే ఎప్పుడూ హాట్ బాంబ్ లాగా ఉండే ఈ అమ్మడు..సడెన్ గా శివ భక్తురాలుగా మారి అందరిని ఆశ్చర్యపరిచింది.. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

మంచు లక్ష్మి సినిమాలు, సోషల్ మీడియా పోస్టులు, ట్రోల్స్ మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు వినూత్నమైన ప్రయోగాలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా అలాంటి ప్రయోగమే చేసింది. శివరాత్రి అంటే.. లోకమంతా శివారాధనతో.. శివ నామ స్మరణతో నిండిపోతుంది. ఎంతోమంది భక్తులు నిష్ఠతో శివుడిని పూజించడం.. ఆరాధించడం చేస్తుంటారు. కాగా.. ఈసారి మహాశివరాత్రిని మంచు లక్ష్మి కూడా దాదాపు శివారాధనలో.. శివనామ స్మరణలో గడిపింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ.. ఆది శంకరాచార్యులు రచించిన మహాశివుని ‘నిర్వాణ శతకం’ స్వయంగా పాడి.. వీడియో రిలీజ్ చేసింది..
ఆ ప్రత్యేక పాటను మంచు లక్ష్మీ తో పాటు ఆమె కూతురు కూడా పాడి అందరిని ఆశ్చర్య పరిచింది.ఈ సాంగ్ వీడియోని తన సొంత యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది. పైగా సాంగ్ మధ్యలో శంకరాచార్యుల శ్లోకాలకు అర్థాన్ని చెబుతూ.. ఇంగ్లీష్ ర్యాప్ క్రియేట్ చేసింది లక్ష్మి. ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన ఈ సాంగ్ ఇప్పుడు శ్రోతలందరికి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మంచు లక్ష్మి వాయిస్ లో సాంగ్ విన్న నెటిజన్స్ కూడా సాంగ్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పాటను కన్ను సమీర్ కంపోజ్ చేశారు. కాగా.. సాంగ్ ని కాశీలో షూట్ చేసినట్లు బ్యాగ్ గ్రౌండ్ విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయ్యండి..