Mahesh Babu : పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మహేష్-నమ్రత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

- Advertisement -

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్లు కొడుతూ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఆయన ప్రస్తుతం రాజమౌళితో ఎస్‌ఎస్‌ఎంబీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే సోషల్ మీడియాకు దూరమై తన లుక్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఆయన కొడుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ డేకు మహేశ్ బాబు వెళ్లాడు. ఈ క్రమంలో.. తాజాగా, సూపర్ స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ నా హృదయం గర్వంతో పొంగిపొర్లుతోంది. గౌతమ్ నీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయినందుకు శుభాకాంక్షలు. నీ కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం మొదలైంది.

ఈ అధ్యాయం నువ్వే రాయాల్సి ఉంది. ఇకపై నీవు మరింతగా వెలుగొందుతావని నాకు తెలుసు. నీ కలలను చేధించుకుంటూ ముందడుగు వేయాలని కోరుతున్నాను. నీపై మా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజు నిన్ను చూసి నీ తండ్రిగా ఎంతగానో గర్వపడుతున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే కొడుకుతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక దీనికి గౌతమ్ తల్లి నమ్రతా శిరోద్కర్ ‘మాటల్లేవ్.. కేవలం ప్రేమ మాత్రమే’ అంటూ కామెంట్ చేసింది. అలాగే ‘‘ నా ప్రియమైన జీజీ, మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. నేను మీ గురించి ఎంత గర్వపడుతున్నానో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.

- Advertisement -

నీపై నీవు నిజాయితీగా ఉండి నీ ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ.. కలలను సాకారం చేసుకుంటావని అనుకుంటున్నాను. నిన్ను నేను ఎంతగా నమ్ముతున్నానో అందరికంటే ఎక్కువగా నిన్ను నువ్వు నమ్ము. జీవితం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, మీకు ఎల్లప్పుడూ నా ప్రేమ మద్దతు ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ ప్రత్యేకమైన రోజుకు అభినందనలు. ఇక్కడ ప్రపంచం మీదే. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన మహేశ్ ఫ్యాన్స్ గౌతమ్‌కు అభినందనలు చెబుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here