చేసిన షూటింగ్ మొత్తం వృథా.. ‘గుంటూరు కారం’ గురించి ఫ్యాన్స్ కి గుండెపోటు వచ్చే న్యూస్!

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ కచ్చితంగా ఉంటుంది. వీళ్లిద్దరి కలియక లో వచ్చిన ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్ద రేంజ్ సక్సెస్ కాకపోయినా కూడా , టీవీ టెలికాస్ట్ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తెచ్చుకున్నాయి. అప్పటి నుండి ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

గుంటూరు కారం
గుంటూరు కారం

వీళ్లిద్దరి కలయిక లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయం లో ‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ప్రారంభం లో ఈ సినిమా మీద అంచనాలు మామూలు స్థాయిలో ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఆ రేంజ్ అంచనాలు లేవు, రోజు రోజుకి బాగా తగ్గిపోతున్నాయి. అందుకు కారణం సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడుతుండడం వల్లే. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు ఎదో ఒక కారణం చేత షూటింగ్ ఆగుతూ వస్తుంది.

Mahesh Babu

ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కేవలం 10 నిమిషాల ఫుటేజీ మాత్రమే తెరకెక్కించారట. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి రోజు టీజర్ విడుదల చేసారు కదా, కేవలం ఆ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే చేశారట. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే మహేష్ బాబు కి ఇప్పటి వరకు చేసిన షూటింగ్ ఔట్పుట్ నచ్చలేదట. వేంటనే ఆ ఔట్పుట్ మొత్తం పక్కన పెట్టేసి స్క్రిప్ట్ లో కీలక మార్పులు జరిపి మొత్తం ఫ్రెష్ గా ప్రారంభించాలని అన్నాడట.

- Advertisement -
Guntur Karam

త్రివిక్రమ్ కూడా దానికి ఓకే చెప్పో ఈ నెల 24 వ తారీఖు నుండి కొత్త స్క్రిప్ట్ తో షూటింగ్ చెయ్యబోతున్నాడు అట. ఇంతకు ముందు పూజ హెగ్డే ని మెయిన్ హీరోయిన్ గా మరియు శ్రీలీల ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు పూజ హెగ్డే ఈ సినిమా నుండి తప్పుకుంది, సెకండ్ హీరోయిన్ శ్రీలీల కాస్త మెయిన్ హీరోయిన్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు, ఇలా ఎన్నో కీలక మార్పులు జరిగాయి, ఇలా ఊహించని ట్విస్టులు రావడం తో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీగా తగ్గిపోయాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com